వస్తున్నా మీకోసం యాత్రలో చంద్రబాబు క్రిష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ, వైఎఆర్ కాంగ్రెస్ పార్టీల పై నిప్పులు కురిపించారు. రాష్ట్రంలో యువతకు ఉపాది లేకుంటే సమాజం పై ద్వేషంతో పక్కదారి పట్టే ప్రమాదం ఉందన్నారు. అవేమీ పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతితో జేబులు నింపుకొని, పొట్టలు పెంచుకుని రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారన్నారు. వైఎస్ అవినీతి కారణంగా విద్యుత్తు కొరత ఏర్పడిందని, విద్యుత్తు ఉంటేనే పరిశ్రమలు వస్తాయన్నారు. పరిశ్రమలతోనే అభివ్రుద్ది సాధ్యమని, పరిశ్రమలు ఉంటే యువతకు ఉపాది అవకాశాలు ఉంటాయని చంద్రబాబు చెప్పారు. తమ హాయంలో లక్షల మందికి సాప్ట్ వేర్ ఉద్యోగాలు వచ్చాయంటే , ప్రస్తుతం అందరిచేతుల్లో సెల్ పోన్లు ఉన్నాయంటే తెలుగుదేశం పార్టీ వలనే జరిగిందని బాబు అన్నారు. దేశంలో నాలెడ్జ్ సొసైటీగా ఆంద్రప్రదేశ్ ను మార్చిన ఘనత టీడీపీ దని చంద్రబాబు గుర్తు చేశారు. కాంగ్రెస్ దొంగల ప్రభుత్వంగా మారిందని , లంచాలు తిని ఇష్టారాజ్యంగా కళాశాలలకు అనుమతి ఇచ్చి. విద్యార్థల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుకుంటుందని చంద్రబాబు అన్నారు. ఒకప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కి చిరునామాగా ఆంద్రప్రదేశ్ పేరు మారుమోగేదీ. బిల్ గేట్స్ తో సహా ఐటీ మహామహులందరు ఇక్కడికి వచ్చేవారు. పెట్టుబడులు పెట్టేవారు. ఉపాది అవకాశాలు దక్కాయి. ఐటీ, ఐఐఎం, ఐఏఎస్ ఇలా అన్నింటా ఆంధ్రప్రదేశ్ దే అధిపత్యం. మరి ఇప్పుడు పెట్టుబడుల పెట్టేందుకు సిద్దమైన వారుకూడా పారిపోతున్నారు. బీహార్, గుజరాత్ లకు వెళ్లిపోతున్నారు. యువతకు ఉద్యోగావకాశాలు లేవు. వైఎస్ తో సహా కాంగ్రెస్ అవినీతి, ఆ చెట్టు కొమ్మ నుంచి పిల్ల కాంగ్రెస్ లే ఈ పరిస్థితికి కారణం. గతంలో ఐటీ హబ్ గా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో నేడు లూటీల హబ్ గా మారిందని చంద్రబాబు ఆవేశంగా అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more