వేసవి కాలం వచ్చిందంటే పరీక్షల హడావిడి, పిల్లలకు శలవులు, పెళ్ళళ్ళు, పర్యటనలు మొదలవుతాయి. వీటన్నిటికంటే ముందు వేసవి వచ్చిందని తెలియటానికి సూచన విద్యుత్ కోతలు. ఈ రోజు నుంచి విద్యుత్ కోతలు మొదలవుతున్నాయి. 2 నుంచి 12 గంటల వరకూ ఉండే విద్యుత్ సరఫరాలో కోతలు ఆయా ప్రాంతాలను బట్టి ఉంటాయి. నగరాల్లో రెండు గంటలైతే జిల్లా కేంద్రాల్లో నాలుగు గంటలు, మున్సిపాలిటీలలో 6 గంటలు, మండల కేంద్రాల్లో 8 గంటలు, పల్లె ప్రాంతాల్లో 12 గంటల విద్యుత్ కోత అధికార ప్రకటనలో ఉన్నదే.
గ్రేటర్ హైద్రాబాద్ లో ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట విద్యుత్ కోత ఉంటుంది. జిల్లా కేంద్రాలలో ఉదయం, మధ్యాహ్నం రెండు రెండు గంటలు, పురపాలక పట్టణాలలో ఉదయం, మధ్యాహ్నం మూడు మూడు గంటల చొప్పున, మండల కేంద్రాలలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ విద్యుత్ కోతలుంటాయి. వ్యవసాయానికి ఏడు గంటల పాటు విద్యుత్ సరఫరా ఇస్తున్న గ్రామాలకు పగలు ఏడు గంటలు మాత్రమే విద్యుతు ఉంటుంది.
అధికారిక ప్రకటనలే ఇలా ఉంటే ఇక అనధికార కోతలు మాటేంటి, పల్లెల్లో ఇక కరెంటు కల్లే అనుకుంటున్నారు. చాలు చాలు అసలు కష్టమంతా మాది అంటారు విద్యుత్ సంస్థల వాళ్ళు. ఉష్ణోగ్రతతో కరెంటు అవసరమూ పెరుగుతుంటుందని, దానికి తగ్గట్టుగా విద్యుత్తు అందకపోతే దానికి మేమేం చెయ్యగలం, ఉన్నదాన్ని సర్దటంలో మా తల ప్రాణం తోకకి వస్తోంది అంటారు. నిన్న 306106 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం పడితే, అందుకు కేవలం 237572 యూనిట్లు మాత్రమే సరఫరా చెయ్యటానికి వీలైంది అని చెప్తున్నారు.
అదనంగా విద్యుత్ ను ఉత్పత్తి చెయ్యాలనే ఆకాంక్షతో ఉన్నా, ఏ విధంగా చెయ్యాలన్నది ట్రాన్స్ కో నిర్ణయించుకోలేకపోతున్నది. ఆర్ ఎల్ ఎన్ జీ, నాఫ్తాలతో చర్చలు సాగిస్తున్న ట్రాన్స్ కో సిఎమ్ డి సమారియా ఇంకా ఇదమిద్ధంగా ఏమీ తేల్చుకోలేకుండా ఉన్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more