పెద్ద చదువు లేక కాయకష్టం మీదనే ఆధారపడి పని చేసుకుంటున్నవారికి ఆ తర్వాత పనిలో పడి చదువుకోవటానికి సమయం ఉండదు. అలాంటి వాళ్ళను, సమాజంలో వెనకబడిపోయి ఉన్నామే అనే బాధ అప్పుడప్పుడూ కలచివేస్తుంటుంది. బ్లూకాలర్ అనబడే వాళ్ళు వైట్ కాలర్ లోకి పరివర్తనం చెందాలని ఆశపడి, అందుకు కావలసిన ఆసక్తి, ఉత్సాహం, కృషి చేసే పట్టుదల ఉన్నంత మాత్రాన చాలదు అందుకు అందుబాటులో శిక్షణా కేంద్రాలు, అందుకు తగ్గ వాతావరణం కూడా ఉండాలి.
తెలివితేటలుండీ, వాటిని ఉపయోగించుకునే అవకాశం లేక యువత లోని సామర్థ్యం ఎంతో వృధా అయిపోతుంటుంది. అలాంటి వారి కోసం శిక్షణా కేంద్రాలను ఏర్పరచి వారిని తీర్చి దిద్దాలనే ఆలోచనను కార్య రూపంలో పెట్టారు భారత్ కి చెందిన స్వచ్ఛంద సంస్థ సవేరా, మరో దుబాయ్ కి చెందిన సంస్థ.
దుబాయ్ లో అల్ క్వోజ్, సోనాపుర్ కార్మికుల నివాస ప్రాంతాలలో ప్రతి శుక్రవారం రెండు గంటలు సుంకం లేని శిక్షణనిస్తూ కార్మికులకు చేయూతనిస్తున్నారు. వాళ్ళు నిర్వహించే తరగతులలో ఇంగ్లీషుతో పాటు కార్మికులకు ఉపయోగయోగ్యమైన వివరాలతో ఙానాన్ని అందజేస్తున్నారు. సవేరా అధ్యక్షురాలు, కోలకతా ఇండియన్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంటులో పట్టభద్రురాలు నీతా మాథుర్ దుబాయ్ లో కార్మిక సంక్షేమం కోసం అహర్నిశలూ పాటుపడుతున్నారు. 2011 లో భారత రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ దుబాయ్ పర్యటనలో ఉన్నప్పుడు కలుసుకుని భారతదేశవాసులకు ఏదైనా మంచి చేద్దామని ఉందన్న కోరికను వెలిబుచ్చినప్పుడు ఆయన, భారతదేశవాసుల సంగతి వదిలిపెట్టి, ఇక్కడ దుబాయ్ లో ఉన్న మన దేశస్తులకు మేలు చెయ్యండి అని సలహా ఇచ్చారట.
దానితో ప్రేరణ చెంది, భారత్ నుంచి వచ్చి అక్కడ పని చేసుకుంటున్నవారి కోసం చెయ్య దగ్గ సేవా కార్యక్రమాన్ని రూపొందించి ప్రారంభించగా, ఇంతవరకు వందమంది భారతీయ కార్మికులు ఇంగ్లీషు, కంప్యూటర్ కోర్సులను చేసారు. సవేరా లో పనిచేసే కార్యకర్తలు రూపొందించిన పాఠ్యభాగాలతో ఔత్సాహికులైన కార్మికులకు ఫీజు లేకుండా శిక్షణ నిచ్చామని, విశ్వవిద్యాలయంలో ని ఆచార్యులు తయారు చేసిన ఆ పాఠ్యభాగాలతో వివిధ తరగతులను నిర్వహిస్తున్నామని, కోల్కతా లో ఐఐఎమ్ లో చదువుకుని సవేరాలో ప్రాజెక్ట్ హెడ్ గా పనిచేస్తున్న డా.సురేష్ నందా చెప్పారు.
ఇంగ్లీషు, కంప్యూటర్, సాంకేతిక విద్యకూ అవసరమైన కోర్సు లను తయారు చేసి భారత దేశస్తులే కాక పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ కి చెందిన కార్మికులకు కూడా శిక్షణనివ్వటం ద్వారా వాళ్ళంతా అనతి కాలంలోనే తాము చేసే పనిలో మార్పు, ఆదాయంలో వృద్ధిని మాత్రమే కాకుండా, ఆత్మస్థైర్యాన్ని ఆత్మసంతృప్తిని కూడా పొందారు. ఉద్యోగవకాశాల తో దుబాయ్ నుంచి ఇతర దేశాలకు పోవటానికి కూడా కొందరికి అవకాశం లభిస్తోంది.
అది చూసి, స్వచ్ఛంద సేవా సంస్థలో పనిచేసే వారంతా తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఈ సమాజానికి ఏదో చెయ్యాలనే మా ఆకాంక్ష ఈవిధంగా నెరవేరుతోంది అంటున్నారు.
శిక్షణ పూర్తి చేసుకున్న వారి ఆనందానికిక అంతు లేదు. చక్కగా ఇంగ్లీషులో మాట్లాడగలగటం, కంప్యూటర్ ని ఉపయోగించగలగటం వారి జీవితాల్లో ఆత్మానందంతో పాటు మేమూ సాధించామన్న తృప్తిని కలుగజేస్తున్నాయంటున్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more