గల్ఫ్ బాధితులను కేంద్రం పట్టించుకోవడం లేదని టీడీపీ ఎంపీ నామా నాగేశ్వరరావు ఆరోపించారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభంకాగానే గల్ఫ్ బాధితులు ఎదుర్కుంటున్న కష్టాలపై ఎంపీ నామా కేంద్రాన్ని ప్రశ్నించారు.గల్ఫ్ బాధితుల అంశాన్ని ఎన్ని సార్లు ప్రస్తావించినా తేలిగ్గా తీసుకుంటున్నారని మండిపడ్డారు. ఎంత మంది గల్ఫ్ బాధితులు జైళ్లలో మగ్గుతున్నారన్న ప్రశ్నకు సైతం ఇంత వరకు సమాధానం ఇవ్వలేదని ఎంపీ విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లేదని ఆయన విమర్శించారు. ఈ అంశంపై ఎన్ని సార్లు సమావేశమయ్యారు, ఎన్ని సమీక్షలు చేశారని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇదే అంశంపై కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గల్ఫ్ జైళ్ల నుంచి బాధితులను ఇంటికి తీసుకురాడానికి కేంద్రం ఏం చర్యలు తీసుకుంటున్నదని ప్రశ్నించారు. గల్ప్ జైళ్ల నుంచి బాధితుల విడుదలకు కేంద్రం చర్యలు తీసుకోవాలని ఎంపీ పొన్నం డిమాండ్ చేశారు.
దీనిపై కేంద్ర మంత్రి వాయలార్ రవి సమాధానమిస్తూ గల్ఫ్ బాధితులపై మూడేళ్లుగా ఎన్నో ఫిర్యాదులు అందాయని చెప్పారు. ఫిర్యాదులపై దర్యాప్తు జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించామని వాటిని పరిశీలించాక చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి వాయలార్ రవి వివరించారు. మంత్రి ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదని నామా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందుకు సంబందించి తగిన చర్యలు తీసుకోవలసిందిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఎప్పిటికప్పుడు సూచిస్తున్నామని వాయలార్ రవి చెప్పారు. ఇటువంటి సమస్యల పరిష్కారానికి కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వా మధ్య సమన్వయం అవసరమని నామా చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more