ఇక నుండి యూట్యూబ్ లో ఉన్న వీడియోలను ఫ్రీగా చూసే అవకాశం ఉండదనే విమర్శలు వినిప్పిస్తున్నాయి. ఇప్పటి వరకు మనం ఉచితంగా కొన్ని వందల వీడియోలు చూసి ఉంటాం. అలాగే కొన్ని వేల వీడియోలను డౌన్ లోడు చేసుకోవటం జరిగింది. ఇక నుండి ఇలా చెయ్యలంటే.. తప్పనిసరిగా డబ్బులు కట్టాల్సిందేనట. ఈ విషయం పై నెట్ ప్రేమకులు మండిపడుతున్నారు. అసలు అలా ఎందుకు చేస్తున్నరంటే.. గూగుల్ సంస్థ యూట్యూబ్ లో పెయిడ్ చానెళ్లను ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు ‘ఆండ్రాయిడ్ పోలీస్’ వెబ్ సైట్ చెబుతోంది. ఇందుకు .. యూట్యూబ్ మొబైల్ యాఫ్ (అప్లికేషన్) కోడ్ లో ఉన్న రెండు లైన్లను రుజువుగా చూపిస్తోంది. యూట్యూబ్ లోని పెయిడ్ ఛానెళ్లను చూడాలన్నా , వద్దనుకున్నా (ఆన్ సబ్ స్ర్కైబ్ ) కంప్యూటర్ ద్వారానే చేయాలని ఆ కోడ్ లో ఉంది. యాడ్ ఏజ్ సంస్థ ప్రకారం .. దీనిపై గూగుల్ ఇప్పటికే పలువురు వీడియో ప్రొడ్యూసర్లతో మాట్లాడినట్లు తెలుస్తోంది. పే స్పెషలిస్టు ఛానెళ్ల కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. యూట్యూబ్ తో ఒప్పందాలు కుదిరితే సదరు చానెళ్లు నెలకు 1 నుంచి 5 డాలర్ల దారా (రూ.54 నుంచి రూ. 270) దాకా వసూలు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గతంలోనే యూట్యూబ్ ‘చందా ఆధారిత’ కంటెంట్ ను ఇచ్చే యోచనలో ఉన్నట్లు పేర్కొంది. మా సైట్ లో కంటెంట్ను ఉంటే చాలా మంది ఆ సబ్ స్ర్కిప్షన్ల ద్వారా తాము బాగా లాభపడతామన్న ఆలోచనలో ఉన్నారు. కాబట్టి మేము కూడా ఆ దిశగా ఆలోచిస్తున్నాం అని యూట్యూబ్ సీఈవో సలార్ కమన్ గర్ ఒక మీడియా సమావేశంలో వెల్లడించారు. తాజా వార్తపై సీనెట్ వెబ్ సైట్ యూట్యూబ్ ను సంప్రదించగా .. ఆ సంస్థ అధికార ప్రతినిది ఒకరు దీన్ని ద్రువీకరించారు. ఈ సారి మేము ప్రకటించడానికి ఏం లేదు. యూట్యూబ్ యూజర్లు మరింతగా ఆనందించే అవకాశాన్ని కల్పిస్తూ.. అదే సమయంలో వీడియోలు పోస్ట్ చేసేవారికి ఆదాయం వచ్చేలా సబ్ స్ర్ర్కిప్షన్ సర్వీసు ను అందుబాటులోకి తెచ్చే యోచనలో ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more