దేశంలో ప్రాణాంతక వ్యాధి ఎయిడ్స్. ఈరోజు 'ప్రపంచ ఎయిడ్స్ డే'. ఈ సందర్భంగా దీనిని పూర్తిగా నివారించేందుకు ప్రభుత్వాలు నడుం బిగించి, దీని వ్రుద్ధి రేటును గత 8 ఏళ్లలో గణనీయంగా తగ్గించాయి. ఎయిడ్స్ డే సందర్భంగా పలు సంస్థలు ఎయిడ్స్పై నివేదికలను విడుదల చేశాయి. వాటి ప్రకారం భారత్లో ప్రాణాంతక హెచ్ఐవీ బారిన పడుతున్న బాధితులు ఏటా తగ్గిపోతున్నారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అంచనాల ప్రకారం దేశంలోని 15 నుంచి 49ఏళ్ల వయసు వారిలో 2007లో 0.33శాతం మందికి హెచ్ఐవీ సోకగా, 2011నాటికి ఈ రేటు 0.27శాతానికి తగ్గిందని తేల్చాయి. ఎనిమిదేళ్ల క్రితంతో పోల్చితే ఇప్పుడు 50శాతం కేసులు త గ్గాయని జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ పేర్కొంది. ఇక ఆంధ్రప్రదేశ్లో ఎయిడ్స్ నియంత్రణను బాగా అమలు చేస్తుండటంతో పాజిటివ్ కేసుల్లో భారీ తగ్గుదల కనిపిస్తోంది. 2004లో 15శాతం ఉన్న ఈ రేటు ఇప్పుడు ఐదు శాతానికి తగ్గిందని ప్రోగ్రామింగ్ మేనేజర్ డాక్టర్ శ్రీధర్ వివరించారు..
మన దేశంలో 50 శాతం తగ్గినా, ఇప్పటికీ దేశంలో మన రాష్ట్రమే అగ్రస్థానంలో ఉంది. మొత్తం 23.9లక్షల మంది రోగుల్లో సుమారు 5.20లక్షల మంది రాష్ట్రంలోనే ఉన్నారు. హెచ్ఐవీ వ్యాపిస్తున్న రేటు రాష్ట్రంలోనే ఎక్కువగా ఉంది. ఇది కొద్దిగా ఆలోచించాల్సిన విషయం. దీని పై ప్రభుత్వం మరింత అవగాహన కల్సించి, ఎయిడ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ప్రజలు కోరుతున్నారు. .
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more