బెజవాడలో కాంగ్రెస్ పార్టీ వర్గపోరు మరోసారి బయటపడింది. కేంద్ర మంత్రి చిరంజీవి రాక సందర్భంగా ఏర్పాటు చేసిన స్వాగత ర్యాలీలో దేవినేని అవినాష్కు ప్రాధాన్యత ఇస్తున్నారంటూ యలమంచలి రవి అనుచరులు నినాదాలు చేశారు. రవికి ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తపరిచారు. విషయం తెలిసిన చిరంజీవి కాన్వాయన్ను ఆపి యలమంచలి రవిని వాహనంలోకి ఎక్కించుకోవడంతో గొడవ సర్దుమనిగింది. పిల్లలంటే తనకు ఎంతో ఇష్టమని, వారితో గడపడానికి అధిక ప్రాధాన్యత ఇస్తానని కేంద్ర మంత్రి చిరంజీవి పేర్కొన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా ఇందిరా గాంధీ మున్సిపాల్ స్టేడియంలో ఎంపీ లగడపాటి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిరంజీవి పాల్గొన్నారు.
చిన్నారులతో పది నిమిషాలు గడిపితే అలసట పోతుందన్నారు. పిల్లల మనసెరిగి తల్లిదండ్రులు నడుచుకోవాలని చిరు సూచించారు. అంతేకాకుండా కూచిపూడీకి ఆదరణ కరవవుతుందనే వాదన వినిపిస్తుందని కేంద్రమంత్రి చిరంజీవి అన్నారు. భారతీయ కళల ఖ్యాతిని మరింత ఇనుమడింప చేస్తామన్నారు. దేశంలో వైవిధ్యమైన పర్యాటక ప్రదేశాలున్నా మార్కెటింగ్ చేసుకోలేక పోతున్నామంటూ కూచిపూడికి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటానని చిరంజీవి చెప్పారు. రాజకీయాలకతీతంగా పర్యాటక రంగ అభివ్రుద్దికి అందరూ సహకరించాలని కోరారు. పర్యాటక ప్రాజెక్టులు పీపీపీ విధానంలోనే చేపట్టాలని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టులను పూర్తిగా ప్రభుత్వమే చేపడితే అశోకా హోటల్స్ లా ఉంటాయన్నారు. భవానీ ద్వీపం లీజు వ్యవహారంలో తనకు ఎలాంటి ప్రమేయం లేదన్నారు. ద్వీపం లీజుకు సంబంధించి ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుందని చిరంజీవి స్పష్టం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more