తనను పెళ్లి చేసుకుంటే, మంచి జీవితం అందిస్తానని మాటలు చెప్పి, పెళ్లైయ్యాక మొహం చాటేస్తున్నాడంటూ ఓ వివాహిత జిల్లా స్థాయి న్యాయమూర్తిపై హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసింది. ఆమె చెప్పిన వివరాలు మేరకు. కర్ణాటక రాష్ట్రం, తుముకూరు జిల్లా పావుగడలో ఉండే రత్నమ్మకు తల్లిదండ్రులు లేరు. తన అక్క రాధమ్మ వద్ద ఉంటున్నది. వీరికి అనంతపురం జిల్లా హిందూపురం మునిసిపాలిటీ ఉన్నతాధికారి ప్రతాప్తో పరిచయం ఏర్పడింది. రత్నమ్మను తన సోదరుడు కడప జిల్లా రాజంపేటలో అదనపు జడ్జిగా పనిచేస్తు న్న విజయచందర్ రాణాతో రెండోపెళ్లికి ప్రతిపాదించారు. ఆయన మొదటి భార్య చనిపోయింది. రత్మమ్మను జడ్జికిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకున్నారు.అనంతపురంలో 2009, నవంబరు 5న పెళ్లి జరిగింది. 3 నెలల తర్వాత రత్నమ్మ గర్భవతి అవడంతో జడ్జి మొదటి భార్య కూతురు అభ్యంతరం చెప్పింది. అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి చేసింది. దానికి జడ్జి కూడా వత్తాసు పల్కడంతో వివాదం అయింది.కొద్దిరోజుల్లోనే రత్మమ్మను జడ్జి ఆమె అక్క ఇంటి వద్ద వదిలేశారు. తర్వాత పెళ్లయ్యాక తన ఇంటి పత్రాలపై జడ్జి రూ.16 లక్షల లోన్ కూడా తీసుకున్నారని, దానికీ ఆయన సమాధానం చెప్పడం లేదని వాపోయింది. తనకు జరిగిన అన్యాయంపై ఆమె పావుగడ పోలీసులకు చెప్పినా ఫలితం లేదని బాధితురాలు రతమ్మ హెచ్ఆర్సీ సభ్యుడు పెదపేరిరెడ్డిని కలిసి బోరుమంది. జడ్జి విజయచందర్తో జరిగిన పెళ్లి ఫొటోల ఆల్బంను, రెండేళ్ల బిడ్డను కూడా ఆయనకు చూపించింది. స్పందించిన హెచ్ఆర్సీ, రత్నమ్మ ఉదంతంపై వాస్తవాలు పరిశీలించి డిసెంబరు 19 లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని కడప ఎస్పీని ఆదేశించింది. ఈ మేరకు ఫాక్స్లో ఆదేశాలు వెళ్లాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more