డిజిపి కార్యాలయం వద్ద ఈనెల 7న ఆటోలో 6.47 కోట్ల రూపాయల నోట్ల కట్టలను సిసిఎస్ పోలీసులు స్వాధీనం చేసుకున్న కేసులో ఆదాయ పన్ను శాఖ కర్నూలుకు చెందిన బాలసాయిబాబా ట్రస్టుకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఇంత భారీ మొత్తంలో నోట్ల కట్టలను పోలీసులు స్వాధీనం చేసుకోవడం రాష్టవ్య్రాప్తంగా సంచలనం సృష్టించింది. నోట్ల కట్టల కేసులో నగదు మొత్తాన్ని బ్యాంకు నుంచి డ్రా చేసి స్థిరాస్తి కొనుగోలుకు వినియోగిస్తున్నట్టు చెబుతూ పోలీసుల వద్దకు 8న తుమ్మపల్లి రామారావు అనే వ్యక్తి వచ్చి సమాచారం ఇచ్చిన విషయం విదితమే. రామారావు బాలసాయి బాబా ట్రస్టు ప్రతినిధిగా ఉన్నారు.
మైసూరులో బాలసాయి బాబా ట్రస్టు ఒక స్ధలం కొనుగోలు నిమిత్తం ఈ సొమ్ములో 4.50 కోట్ల రూపాయలను బ్యాంకు నుంచి, మిగిలిన సొమ్మును శిష్యుల నుంచి సేకరించి మధ్యవర్తికి ఇచ్చేందుకు ఆటోలో తరలిస్తున్నామని రామారావు సైఫాబాద్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఈ నగదును సిసిఎస్ పోలీసులు ఆదాయం పన్ను శాఖకు అప్పగించారు. ప్రస్తుతం బాలసాయిబాబా ట్రస్టు ఆదాయం వివరాలను తెలియచేయాల్సిందిగా ఆదాయం పన్ను శాఖ కర్నూలు ట్రస్టుకు నోటీసులు జారీ చేసింది. సంతృప్తికరమైన సమాధానాన్ని బట్టి తదుపరి చర్యలు ఉంటాయని ఐటి శాఖ వర్గాలు పేర్కొన్నాయి.
కర్నూలులోని బాలసాయి ఆశ్రమంలో ఐటి దాడులు జరుగుతాయన్న వార్తల నేపథ్యంలో గేటుకు తాళం కనిపించింది. హైదరాబాద్లో ఆటోలో తరలిస్తున్న ట్రస్టు డబ్బు పోలీసులకు చిక్కన తరువాత కర్నూలు ఆశ్రమంపై దాడులు జరుగుతాయన్న వార్తలు వినవచ్చాయి. దీంతో ఆశ్రమానికి చేరుకున్న విలేఖరులకు అక్కడి ఎలాంటి సమాచారం లభించలేదు. ఆశ్రమం గేటుకు తాళం కనిపించింది. దీనిపై చుట్టుపక్కల వారిని సంప్రదించగా చాలా రోజులుగా కేవలం ఉదయం, సాయంత్రం పూట మాత్రమే ఆశ్రమం తెరుస్తున్నారని, మిగతా సమయంలో మూసే ఉంటోందని తెలిపారు. ఆశ్రమానికి గతంలో ఉన్న వైభవం నేడులేదని, రామారావు ఎప్పుడో ఒకసారి వచ్చివెళ్తుంటారని, భక్తలెవరూ రావడం లేదని తెలుస్తోంది.
...avnk
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more