ఆయనకు ఆక్రోశం వస్తే ఎలా ఉంటుందో నిరూపించారు. ఆ జిల్లా కలెక్టర్ చేత స్వామీజి పరుగులు తీయించారు. స్వామీజీ తలచుకుంటే ఏం జరుగుతుందో రాష్ట్ర ప్రజలకు తెలిసింది. తూర్పుగోదావరి జిల్లా తాండవనదీ తీరంలోని కుమ్మరిలోవ తపోవనం ఆశ్రమ పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామీజీ శాంతియుత పోరాటం చేశారు. వరద సమయంలో తనపట్ల ఆధికారులు చూపిన నిర్లక్ష్యంపై రాష్ట్ర గవర్నర్, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి జిల్లా యంత్రాంగాన్ని గడగడలాడించారు. రెండురోజుల క్రితం తాండవనది ఉగ్రరూపంలో విరుచుకుపడడంతో 'సచ్చిదానంద' తన శిష్యబృందంతో సహా ఆశ్రమం పై కప్పు ఎక్కి ప్రాణాలు దక్కించుకున్నారు. చుట్టూ నిలువెత్తు నీరు కమ్ముకొచ్చి ఆశ్రమం మొత్తాన్ని కబళించింది. ఆ సమయంలో ఆయన స్థానిక యంత్రాంగానికి సమాచారమిచ్చి సాయం చేయాలని కోరినా స్పందించకపోయేసరికి కేంద్రం విపత్తు నివారణా సంస్థకు చెప్పడంతో ఆయన రక్షణకు నేవీ హెలికాప్టర్ పంపారు.
అప్పటికే నీటి మట్టం తగ్గడంతో ఆలస్యంగా స్పందించిన యంత్రాంగం సేవలు తనకు అక్కరలేదని తిప్పి పంపారు. తదుపరి రెండు రోజులైనా అధికారులు ఆశ్రమం వైపు కన్నెత్తి చూసిన పాపానపోలేదు. దీంతో స్వామీజీ ఆగ్రహించి రాష్ట్ర, కేంద్రాల్లో తనకున్న పలుకుబడితో గవర్నర్ ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఒక్కసారిగా అధికారుల్లో కదలిక వచ్చింది. సిబ్బంది హుటాహుటిన ఆశ్రమానికి వెళ్ళి పాలు ఇతర ఆహారపదార్థాలు అందజేసినా ఆయన స్వీకరించలేదు. ఏకంగా జిల్లా కలెక్టర్ నీతుకుమారి ఆశ్రమానికి చేరుకుని అవకాశం లేక రాలేకపోయామని, నిర్లక్ష్యం చేయలేదని సర్దిచెప్పారు. దీనికి స్వామీజీ ఒక్కసారిగా తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఏ ఒక్కరినుంచీ రూపాయి ఆశించకుండా ధర్మాన్ని భోధిస్తూ ఆశ్రమాన్ని అభివృద్ధ్ది చేశానన్నారు. ఇప్పుడిదంతా నీటిపాలైందన్నారు. తాండవ అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వకుండా అన్నిగేట్లు ఎత్తేశారన్నారు. ఆమె అధికార యంత్రాంగం వైఫ్యలంపై తాను పరిశీలిస్తానంటూ శాంతింపజేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more