తెలంగాణ మార్చ్ ను నిర్వహించేందుకు టీజేఏసీ నేతలు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, ప్రభుత్వం మాత్రం మార్చ్ కు అనుమతి లేదని స్పష్టం చేసింది. మార్చ్ కు జిల్లాల నుంచి ప్రజలు నగరానికి వచ్చే దారులన్నీ పోలీసులు దిగ్బంధనం చేస్తారనే ఉద్దేశ్యంతోనే హైదరాబాద్ నుంచే భారీ సంఖ్యలో జన సమీకరణ చేయాలని జేఏసీ భావిస్తోంది. సుమారు 2నుంచి 4లక్షల మంది వరకు ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు మీదుగా తీసుకురావాలనుకుంటున్నారు. అయితే ట్యాంక్ బండ్ ను ఎంచుకోవడం కూడా కొన్ని ఉద్దేశ్యాలున్నాయి. నగరానికి కేంద్ర స్థానంగా ఉండటం.. వినాయకులను నిమజ్జనం చేసేందుకు వచ్చే వారు తిరిగి వెళ్లకుండా అక్కడే ఉండే విధంగా జేఏసీ నేతలు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ప్రజలు భారీ సంఖ్యలో రోడ్డుపైకి వచ్చిన తర్వాత ఎన్ని రోజులు ఉండాల్సి వస్తోందో తెలియదు కాబట్టి ట్యాంక్ బండ్ అనువైన ప్రదేశంగా భావిస్తున్నారు. నగరంలోని ఎన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి రావాలనే దానిపై కూడా జేఏసీ నేతలు చర్చలు జరుపుతున్నారు. గతంలో జరిగిన పోరాటాల అనుభవాలను కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. ఇంకా అయిదు రోజుల సమయమే ఉన్నందున వీలైనంత వరకు ఒక రోజు ముందుగానే ఇరత ప్రాంతాల నుంచి వచ్చే వారిని ఇక్కడికి రప్పించాలని జేఏసీ నేతలు భావిస్తున్నారు. మరోవైపు టీజేఏసీ చైర్మన్ కోదండరాం, ఇతర నేతలు నగర పోలీస్ కమీషనర్ అనురాగ్ శర్మను కలిసి తెలంగాణ మార్చ్ కు అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే మార్చ్ కు అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదని కమిషనర్ జేఏసీ నేతలకు చెప్పినట్లు సమాచారం.
ప్రభుత్వం కూడా జేఏసీ నాయకుల చర్యలను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. మార్చ్ ను వాయిదా వేసుకోవాలని ఇప్పటికే హోంమంత్రి కూడా జేఏసీ నేతలను కోరారు. బయోడైవర్సిటీ సదస్సు జరుగుతున్న రీత్యా ముందుస్తుగానే జేఏసీ నాయకులన్ని అరెస్ట్ చేస్తారనే వార్తలు వస్తున్నాయి. జిల్లాల నుంచి జేఏసీ నేతలు ముందుగానే హైదరాబాద్ వచ్చి తలదాచుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు కొందరు తెలంగాణ మార్చ్ కు సంపూర్ణ మద్దతునిచ్చారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నాయకులెవ్వరూ తెలంగాణను అడ్డుకోవద్దని కేశవరావు కోరారు.
...avnk
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more