మరోవైపు, జగన్ అక్రమాస్తుల కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. ఇంతకుముందు పలుసార్లు వాయిదా పడ్డ ఈ కేసుపై నాంపల్లి సిబిఐ కోర్టు తాజాగా మరోమారు విచారణ జరిపింది. వాన్పిక్కు భూ కేటాయింపులకు సంబంధించి సిబిఐ దాఖలు చేసిన నాలుగవ ఛార్జిషీటుపై విచారణ జరిపిన సిబిఐ కోర్టు దీనిపై తదుపరి విచారణను అక్టోబర్ తొమ్మిదవ తేదీకి వాయిదా వేయడంతో పాటు జగన్ సహా మిగతా ముగ్గురు నిందితులకు రిమాండ్ పొడిగించింది. వాన్పిక్ కేసులో కోర్టు సమన్లు అందుకుని విచారణకు హాజరైన మంత్రి ధర్మాన ప్రసాదరావుకు సిబిఐ కోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
కాగా, నాంపల్లి సిబిఐ కోర్టులో జరిగిన జగన్ ఆస్తుల కేసు విచారణ కోర్టు లోపల, బయట తీవ్ర ఉత్కంఠతకు దారి తీసింది. వాన్పిక్ భూ కేటాయింపులకు సంబంధించిన విచారణకు హాజరు కావాలని మంత్రి పదవికి రాజీనామా చేసిన ధర్మాన ప్రసాదరావుతో పాటు ఇద్దరు ఐఎఎస్ అధికారులు మన్మోహన్ సింగ్, శామ్యూల్, జగతి పబ్లికేషన్స్ వైస్ ఛైర్మన్ విజయసాయి రెడ్డితో పాటు మరో 10 మంది వ్యక్తులు, సంస్థలకు సిబిఐ కోర్టు సమన్లు జారీ చేయడంతో వారంతా ఉదయం పదిన్నర గంటలకల్లా నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు. చంచల్గూడ జైల్లో వున్న వై.ఎస్ జగన్, మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణ, ఐఆర్ఎస్ అధికారి బ్రహ్మానందరెడ్డి, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్లను జైలు అధికారులు భారీ భద్రత మధ్య కోర్టుకు తరలించారు. ఇందులో జగన్ను బుల్లెట్ ప్రూఫ్ కారులో, పోలీసు ఎస్కార్ట్ మధ్య తరలించారు. ఉదయం 11 గంటలకు కేసు విచారణకు వచ్చింది. ధర్మాన తదితరులు మొదట కోర్టుకు హాజరుకాగా, జగన్, నిమ్మగడ్డ ప్రసాద్, మోపిదేవి వెంకటరమణ, బ్రహ్మానందరెడ్డి తర్వాత అక్కడకు వచ్చారు. అందరూ వచ్చిన విషయాన్ని నిర్ధారించుకున్న తరువాత ఈ కేసు విచారణను అక్టోబర్ తొమ్మిదవ తేదీకి మెజిస్ట్రేట్ వాయిదా వేశారు. దీని తరువాత నలుగురిని పోలీసులు భారీ భద్రత మధ్య చంచల్గూడ జైలుకు తరలించారు. అంతకుముందు కోర్టుకు హాజరయ్యే సమయంలో జగన్.. ధర్మాన ప్రసాదరావు, మోపిదేవిలతో కరచాలనం చేశారు. మోపిదేవి, ధర్మానలు ఒకరికొకరు ఎదురుపడ్డా పలకరించుకోలేదు. కరచాలనం కూడా చేయక పోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇదే కేసులో నిమ్మగడ్డ ప్రకాష్, విజయసాయిరెడ్డి, శామ్యూల్, మన్మోహన్ సింగ్ల విచారణ కూడా అక్టోబర్ తొమ్మిదవ తేదికి వాయిదా వేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
...avnk
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more