తన భర్త మరో ఆమెతో కులుకుతున్నాడంటూ ఓ భార్య పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగితే.. దానికి పూర్తి విరుద్దంగా జరిగింది మరో ఘటన. రంగారెడ్డి జిల్లా, పరిగి మండలం నష్కల్లో ఈ విషాదం చోటు చేసుకుంది. తన భర్తను పోలీసులు అరెస్టు చేశారనే మనస్తాపంతో ఇద్దరు పిల్లలతో కలిసి ఓ మహిళ బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. గ్రామంలో జరిగిన ఓ దొంగతనం కేసులో రాజు అనే వ్యక్తిని రెండు రోజుల క్రితం పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు అతని భార్య లక్ష్మిని కూడా శనివారం ప్రశ్నించారు. దీంతో ఆమె మనస్తాపానికి గురైంది. దొంగతనం కేసులో పోలీసులు తనను, తన భర్తను వేధిస్తున్నారని ఆరోపిస్తూ పిల్లలతో కలిసి బావిలోకి దూకింది. మృతదేహాలను స్థానికులు ఈ (ఆదివారం) ఉదయం బయటకు తీశారు. మృతురాలి బంధువులు కూడా పోలీసుల వేధింపుల వల్లనే ఆమె మృతి చెందిందని ఆరోపిస్తున్నారు.
..avnk
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more