High alert in major cities

high alert in major cities

high alert in major cities

3.gif

Posted: 08/15/2012 01:36 PM IST
High alert in major cities

       స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉగ్రవాదులు అక్రుత్యాలకు పాల్పడవచ్చన్న ఇంటెలిజెన్స్ నివేదికల నేపధ్యంలో దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో భద్రత కట్టుదిట్టం చేసారు. ఇవాళ కర్నాటకలో బాంబులు పేలుస్తామంటూ వచ్చిన ఫోన్ కాల్ తో ఒక్కసారిగా కలకలం రేగింది. ఉగ్రవాదుల బెదరింపులతో కర్ణాటకలోని మైసూరు రైల్వే స్టేషన్ కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు అప్రమత్తంగా alertఉండాలని ఇంటిలిజెన్స్ శాఖ మైసూరు రైల్వేబోర్డుకు తెలియచేసింది. చారిత్రాత్మక నేపథ్యం ఉన్న మైసూరు నగరంపై ఉగ్రవాదులు దృష్టి సారించడం ఆందోళనపరుస్తోంది. వెంటనే అప్రమత్తమైన పోలీసు శాఖ రైల్వే స్టేషన్ లో వందకుపైగా పోలీసులను నియమించింది. రైల్వే పోలీసులతోపాటు బాంబు స్క్వాడ్ ఇంటెలిజెన్స్ దళానికి చెందిన 25మందితో కూడిన ప్రత్యేక బృందాన్ని భద్రత కోసం వినియోగించారు. ఇంటిలిజెన్స్ శాఖ బృందం ఇప్పటికే మైసూరుకు వచ్చి రైల్వే స్టేషన్ పై డేగకన్ను వేసింది. రైల్వే స్టేషన్ కు వచ్చే ప్రయాణికుల లగేజీలను పరిశీలిస్తూ అనుమానాస్పద వ్యక్తులను విచారిస్తోంది. మరోవైపు కర్నాటక, ఆంధ్రప్రదేశ్  సహా నాలుగు రాష్ట్రాలకు ఉగ్రవాదుల నుంచి ముప్పు వుందని ఐబీ హెచ్చరించింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  August 15th celebrations in all over the andhra pradesh
Happy independence day to all my visitors  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles