ముందుగా ఆంధ్రావిశేష్.కాం సందర్శకులందరికీ భారతమాత స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు. ఇక ఇవాళ దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ సందడి నెలకొంది. మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. 66వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని దేశ ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. పోరాట యోధుల త్యాగాన్ని గుర్తుచేసుకుంటున్నారు. మా తుఝే సలామ్ అంటూ జెండా వందనం చేస్తున్నారు. దేశంలోని మహానగరాలతోపాటు చిన్న చిన్న మారుమూల పల్లెల్లో కూడా 66వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీలోని ఎర్రకోటపై త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. ప్రధాని మన్మోహన్ సింగ్ జాతీయ జెండాని ఎగురవేశారు. ఆ తర్వాత త్రివిధ దళాల గౌరవవందనం స్వీకరించారు. స్వాతంత్ర్య వేడుకల్లో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.
ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాని ఉద్వేగంగా ప్రసంగించారు. పేదరికం, అవిద్య, ఆకలి తొలగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్రం సిద్ధించినట్లని ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. ఎర్రకోటలో జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాని దేశ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. వైఫల్యాలనుంచి పాఠాలు నేర్చుకుని దేశప్రజలంతా కలసికట్టుగా ముందుకు సాగినప్పుడే మనం నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించగలమని ప్రధాని అన్నారు.
దేశాభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రణబ్ జాతినుద్దేశించి చేసిన తొలి ప్రసంగంలో నెహ్రూ, గాంధీ, చంద్రబోస్ ల త్యాగాలను కొనియాడారు. ఆధునికత, అభివృద్ధిలో భారత్ మరింత పురోభివృద్ధి సాధించాలని ప్రణబ్ ఆశాభావం వ్యక్తం చేశారు. మౌలిక సదుపాయాలు, విద్యాఫలాలు ప్రతి ఒక్కరికీ అందాలన్నారు. పేదరికం, అనారోగ్య రహతి భారత్ ఆవిర్భవించాలని ఆకాంక్షించారు. దేశాల మధ్య పరస్పర సహకారంతో ఉగ్రవాదం, తీవ్రవాద నిర్మూలన సాధ్యమని తన ప్రసంగంలో పేర్కొన్నారు.
...avnk
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more