ఆగష్టు 15 జెండా పండుగ సందర్భంగా మువ్వన్నెల జెండా రాష్ట్రంలో రెపరెపలాడింది. సీఎంతో పాటు ప్రముఖ నేతలంతా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రజలందరికీ స్వాంతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మహనీయుల త్యాగఫలంగానే స్వాంతంత్ర్యం సిద్ధించిందని స్వాంతత్ర్య దినోత్సవ ప్రసంగంలో ముఖ్యమంత్రి శ్లాఘించారు. అట్టడుగు వర్గాల అభివృద్ధితోనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని ప్రభుత్వం నమ్ముతోందన్నారు. సంక్షేమ, అభివృద్ధి పథకాలను కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అందరికీ వర్తింప చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అందించారు. ప్రజలంతా సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో వర్థిల్లి దేశం సుభిక్షంగా ఉండాలని కాంక్షించారు.
గాంధీభవన్ లో పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. జెండా ఎగురవేసిన పీసీసీ చీఫ్ పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ గాందీభవన్ లో జాతీయ జెండా ఎగురవేశారు.సీఎం కిరణ్, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు పలువురు నేతలు జెండా వందనంలో పాల్గొన్నారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జాతీయ జెండాను ఎగుర వేసి గౌరవ వందనం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. దేశంలో రోజురోజుకి పెరిగిపోతున్న అవినీతి ప్రజాస్వామ్యానికే ముప్పుగా మారిందని చంద్రబాబు అన్నారు. అవినీతి రహిత సమాజాన్ని సాధించినప్పుడే త్యాగధనుల పోరాటానికి ఫలితం దక్కినట్టు అవుతుందని బాబు అన్నారు.
టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ సీనియర్ నాయకుడు నాయిని నర్సింహారెడ్డి జెండా ఎగురవేశారు. కార్యక్రమానికి పార్టీ ఎమ్మెల్యలతో పాటు ముఖ్యనాయకులు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను దగా చేసిందని నాయిని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం గురించి పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ గౌరవద్యక్షురాలు వైఎస్ విజయమ్మ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమానికి పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ నాయకులు హాజరయ్యారు.
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, షాపులు, స్కూల్స్, అన్నింటా జాతీయ జెండా రెపరెపలాడింది. ఉదయం నుంచీ చిన్నారులు త్రివర్ణపతాకాన్ని చేతబట్టి వీధుల్లో సందడి చేస్తూ కనిపించారు. అన్ని పాఠశాలలు, కళాశాలలు, యూనివర్శిటీల్లో జెండావందనం సమర్పించారు.
...avnk
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more