కొడుకు చేసిన తప్పులను సమర్థించే తల్లులు ఉన్న విషయం తెలిసిందే. అయితే తన కొడుకు చేసిన ఘోరమైన తప్పు కు అతని బాధితుల ముందు తల వంచి క్షమాపణలు కోరింది. అమెరికాలోని విస్కాన్సిస్ గురుద్వారాలో కాల్పులు జరిగినప్పుడు అరవై అయిదేళ్ల గురుద్వారా అధిపతి సాద్వంత్ సింగ్ కలేకా వీరోచితంగా ఎదురొడ్డి పలువురు మహిళలు, పిల్లల ప్రాణాలు కాపాడారు. అందుకోసం ఆయన తన ప్రాణాలనే పణంగా పెట్టారు. అమెరికా మాజీ సైనికుడు, అయిన మైఖేల్ పేజ్ను కలేకా అడ్డుకునే సరికి అతను పార్కింగ్లో ఒకరిని కాల్చి చంపాడు. కలేకా తన వద్ద ఉన్న సిక్కులు సాంప్రదాయంగా ధరించే కృపాణ్(కత్తి)తో ఫేజ్తో తలపడ్డాడు. అయితే ఫేజ్ తన వద్ద ఉన్న తుపాకితో కలేకాను కాల్చి చంపాడు. తన ఆయుధం, బలం సరిపోవని తెలిసినప్పటికీ పేజ్ను నిలువరించడానికి కలేకా చేసిన కొద్ది క్షణాల ప్రయత్నం వల్ల మహిళలు, పిల్లలు కాల్పుల నుండి తప్పించుకోవడానికి వీలయింది. ఆ కాస్త సమయంలో పలువురు ఆ ఆవరణలో ఉన్న గదుల్లోకి వెళ్లి తలుపులు బిగించేసుకొని దాక్కున్నారు.
1982లో అమెరికా వచ్చిన కలేకా వ్యాపారవేత్తగా విజయం సాధించారు. ఆయన సంపాదన అంతా గురుద్వారా నిర్మాణానికే ఉపయోగించారు. గురుద్వారాలో ఆరుగురిని కాల్చి చంపిన పేజ్కు శ్వేతజాత్యాహంకార సంస్థలతో సంబంధాలు ఉన్నాయని దర్యాఫ్తు అధికారులు భావిస్తున్నారు. ఆ కోణంలో ఎఫ్బిఐ దర్యాఫ్తు చేస్తోంది. భారత విదేశాంగ మంత్రి ఎస్.ఎం.కృష్ణ అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్కి ఫోన్ చేశారు. ప్రార్థనాలయాల్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని హిల్లరీని కృష్ణ కోరారు. ఆమె సానుకూలంగా స్పందించారు. గురుద్వారాలో హత్యోదంతంతో కలత చెందానని అధ్యక్షుడు ఒబామా అన్నారు. మరోవైపు ఆరుగురు సిక్కులను హతమార్చడంపై హంతకుడు పేజ్ తల్లి లారా లిస్ దిగ్భ్రాంతి వ్యక్తం చశారు. బాధితులకు క్షమాపణలు చెప్పారు. పేజ్ చిన్నప్పుడు ఎంతో మంచిగా మెదిలేవడాని, ఆప్తులను కోల్పోయిన వారికి నా సంతాపం తెలియజేస్తున్నానన్నారు. జరిగిన ఘటనకు క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. 12 ఏళ్లుగా పేజ్తో సంబంధాలు లేవని, తన కుమారుడి మరణ వార్త విని తన హృదయం ముక్కలైందన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more