రాష్ట్రంలో మధుమేహం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ప్రతి పది మందిలో ముగ్గురు డయాబెటిక్ వ్యాధితో బాధపడుతున్నట్టు హైదరాబాద్లోని నిమ్స్ కేంద్రంగా పనిచేస్తోన్న మధుమేహ పరిశోధనా సంస్థ (డీఆర్ఐ) తాజా నివేదికలో వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో కోటిన్నర మంది పైనే మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉండవచ్చని నివేదిక తెలిపింది. 2002 నివేదిక ప్రకారం రాష్ట్రంలో 16 శాతం మందికి మధుమేహం ఉండగా.. ఇప్పుడు ఇది రెండింతలై 32 శాతానికి చేరుకుంది. ముఖ్యంగా పాతికేళ్ల వయసు దాటినవారికి వచ్చే టైప్ 2 డయాబెటిక్ వేగంగా విస్తరిస్తోంది. టైప్ 2తో పోల్చుకుంటే 15 ఏళ్లలోపు ఉండేవారికి వచ్చే టైప్ 1 డయాబెటిక్ వ్యాధి తక్కువగానే ఉంది. నగరాల్లో టైప్ 2 డయాబెటిక్తో బాధపడేవారు సుమారు 21 శాతం ఉంటే.. పల్లెల్లో 7 శాతం మందికి ఉన్నట్టు తేలింది. గతంలో ఇది పల్లెటూళ్లలో 1 లేదా 2 శాతం మాత్రమే ఉండేది. ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రపంచవ్యాప్తంగా 70 నగరాలను డయాబెటిక్ కేంద్రాలుగా గుర్తిస్తే.. అందులో అత్యధిక శాతం డయాబెటిక్ రోగులున్న నగరంగా హైదరాబాద్ మొదటిస్థానంలో నిలిచింది. నగరంలో ప్రతి 10 మందిలో నలుగురు మధుమేహంతో బాధపడుతున్నట్టు స్పష్టమైంది.
కొత్త రకాల జబ్బులూ కారణమే, ఇన్నాళ్లూ మానసిక ఒత్తిళ్లు, భోజనంలో ఎక్కువగా వరి అన్నం తీసుకోవడం, వ్యాయామం లేకపోవడం తదితర ప్రధాన కారణాలనే డయాబెటిక్ జబ్బుకు కారణంగా వైద్యులు చెబుతుండేవారు. కానీ ఇప్పుడు డీఆర్ఐ మరికొన్ని కఠోర వాస్తవాలు వెల్లడించింది. రాష్ట్రంలో అనేక కొత్త జబ్బులు రావడం కూడా షుగర్కు కారణమవుతోందని తెలిపింది. దీనికితోడు కాలుష్యం కూడా ప్రధాన కారణంగా పనిచేస్తోందని పేర్కొంది. హైదరాబాద్లాంటి ప్రధాన నగరాల్లో రోజుకో కొత్త రకం జ్వరాలు సోకుతున్నాయ ని, దీంతో శరీరంలో వ్యాధినిరోధక శక్తి కోల్పోతుండటం కారణంగా కూడా మధుమేహం వస్తోందని తెలిపింది. దేహంలో సీసం, మెర్క్యురీ, లెడ్, నికెల్ తదితర లోహాల మోతాదు ఎక్కువగా ఉండటం ప్రమాదంగా మారుతోందని వెల్లడించింది. వ్యాధి నిరోధక శక్తి కణాలకు వ్యతిరేకంగా శరీరంలో కొత్త కణాలు పుట్టుకొచ్చి నిర్వీర్యం చేస్తున్నట్టు పరిశోధనల్లో స్పష్టమైంది. టైప్ 2 డయాబెటిక్తో బాధపడుతున్నవారిలో ఎక్కువగా గుండెజబ్బులు, కిడ్నీ జబ్బులు, కంటి, పంటి జబ్బులు వస్తుండగా... టైప్ 1 బాధితులకు టీబీ సోకుతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more