ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలిన సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా ఈ రోజు బాంద్రాలోని తన స్వగృహం లో తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా శ్వాసకు సంబంధించిన వ్యాధితో రాజేష్ ఖన్నా బాధ పడుతున్నారు. గత నెలలో తీవ్ర అనారోగ్యంలో ఆసుపత్రిలో చేరిన రాజేష్ ఖన్నాని నిన్ననే ఇంటికి పంపించారు. పరిస్థితి విషమించడంతో ఈయన తుది శ్వాస విడిచారు. ఈయన మరణ వార్త విన్న బాలీవుడ్ ఒక్కసారిగా శోక సముద్రంలో మునిగిపోయింది. ఈయన పార్టీవ దేహాన్ని చూడటానికి బాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు భారీ ఎత్తున తరలి వస్తున్నారు.
1942 డిసెంబర్ 29లో అమృత్సర్లో జన్మించిన రాజేష్ఖన్నా బాలీవుడ్లో 163 సినిమాల్లో నటించారు. ఆయన మూడు ఫిల్మ్ఫేర్ అవార్డ్లను సొంతం చేసుకున్నారు. 1966లో "ఆఖ్రీ రాత్"సినిమాతో కెరీర్ను ప్రారంభించిన కాకా రాజ్, బహారోంకీ సప్నే, ఇత్తెఫాఖ్, ఆరాధన వంటి సూపర్హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించారు. ఈయన నటుడుగానే కాకుండా నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా కూడా రాణించారు. 1991 నుంచి 1996 వరకు ఎంపీగా పని చేశారు.
1973లో డింపుల్ కపాడియాను వివాహం చేసుకున్న ఖన్నా 1984లో ఆమె నుంచి విడిపోయాడు. ప్రస్తుతం వీరు విడివిడిగా జీవిస్తున్నప్పటికీ, విడాకులు తీసుకోలేదు. పెద్ద కూతురు ట్వింకిల్ ఖన్నా కొంత కాలం సినిమాల్లో నటించిన అనంతరం బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ను పెళ్లాడింది. రెండో కూతురు రింకీ ఖన్నా కూడా ఒకటిరెండు సినిమాల్లో నటించింది. తర్వాత ఆమె లండన్లోని ఓ వ్యాపారవేత్తను వివాహం చేసుకొని అక్కడే స్థిరపడింది. ఖన్నాతో విడిపోయినప్పటికీ డింపుల్ కపాడియా కొంత కాలంగా ఆయన వెంటేవుండి సపర్యలు చేస్తున్నారు. ఒకప్పుడు బాలీవుడ్ అంటే రాజేష్ ఖన్నా. రాజేష్ఖన్నా అంటే బాలీవుడ్. ఆయన లేని బాలీవుడ్ను ఊహించుకోలేం.
ఈయన మరణం పట్ల బాలీవుడ్ సినీ ఇండస్ట్రీతో పాటు ఆంధ్రవిశేష్ కూడా తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more