వీసాల ఫీజులు పెంచడంతో ఇప్పటికే కంపెనీ మార్జిన్లపై ప్రభావం పడుతోంది. ఇదే పరిస్థితి రానున్న కాలంలో కూడా కొనసాగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అమెరికా వీసాలు పొందడం భారత ఐటి కంపెనీలకు తలకు మించిన భారంగా మారుతోంది. వీసా రుసుమును పెంచడంతోపాటు వీసా నిబంధనలను కఠిన తరం చేయడం వల్ల ఐటి కంపెనీలు నానా ఇబ్బందులు పడుతున్నాయి. భారత ఐటి రంగానికి అమెరికా మార్కెట్ నుంచి 60 శాతం రాబడి వస్తోంది. అందుకే ఈ మార్కెట్ మన దేశ కంపెనీలకు చాలా కీలకం. కంపెనీలు నియమించుకున్న ఉద్యోగులను అమెరికాకు పంపేందుకు భారీ స్థాయిలో వీసాలకు దరఖాస్తు చేస్తున్నాయి. వీటి ఫీజు పెరగడం ఇప్పుడు కంపెనీల పాలిట శాపంగా మారుతోంది. అంతేకాకుండా వీసా నిబంధనల్లో మార్పుల కారణంగా చాలా వీసా దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి. ఫలితంగా కంపెనీలు వెచ్చించే వ్యయం అధికం అవుతోంది. అయినా కంపెనీలు తమ వ్యాపారాన్ని నిరాటకంగా కొనసాగించే నిమిత్తం వీసాల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. దేశంలో అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీగా ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) ఈ ఏడాదిలో 5,900 హెచ్-1బి వీసాల కోసం దరఖాస్తు చేసింది.
గత ఏడాదిలో ఈ కంపెనీ 4,500 వీసాలకు దరఖాస్తులు సమర్పించింది. ఎల్1 కేటగిరీ వీసాలు అధికంగా తిరస్కరణకు గురవుతున్న కారణంగా ఈ సారి హెచ్1బి వీసాలకు ఎక్కువగా దరఖాస్తు చేసినట్టు టిసిఎస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, గ్లోబల్ హ్యూమన్ రీసోర్స్ హెడ్ అజయ్ ముఖర్జీ చెబుతున్నారు. కాగా కంపెనీల అధికారులు, పరిశ్రమల సంఘం అసోచామ్ లెక్కల ప్రకారం యుఎస్లో తిరస్కరణకు గురవుతున్న వీసాలు 40 శాతంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీసాలకు సంబంధించిన నిబంధనలను తమ స్పష్టంగా తెలియజేయాలని యుఎస్ అడ్మినిస్ట్రేషన్తో పరిశ్రమ వర్గాలు చర్చలు జరుపుతున్నాయి. దేశంలోని చాలా ఐటి కంపెనీలు ఎల్ 1 వీసాల కోసం దరఖాస్తు చేస్తుంటాయి. దీని ద్వారా కంపెనీలు తమ అమెరికాలోని ఆఫీసుకు ఉద్యోగులను ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంటుంది. హెచ్ -1బి వీసా అనేది నాన్ ఇమిగ్రెంట్ వీసా. ఈ వీసా కింద యుఎస్ కంపెనీలు విదేశీ వర్కర్లను అనుమతించడానికి ఆస్కారం ఉంటుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more