ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 31ఏళ్ళ తరువాత మాతృదేశంలో అడుగుపెట్టిన సుర్జీత్సింగ్ ఆనందపారవశ్యంతో పులకించిపోయాడు. మూడు దశాబ్దాల పాటు పాకిస్తాన్ జైల్లో మగ్గిన 69 ఏళ్ళ సుర్జీత్సింగ్ వాఘా సరిహద్దు దాటి భారత్లో ప్రవేశించాడు. లాహోర్లోని కోట్లఖ్పట్ జైలు నుంచి ఉదయం విడుదలైన అతడు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హర్షద్వానాల మధ్య భారత్లో ప్రవేశించాడు. తొలుత వాఘాకు ఆవలివైపున పాకిస్తాన్లో అన్ని అధికార లాంఛనాలు పూర్తిచేసుకుని పట్టలేనంత సంతోషంలో సుర్జీత్ ఇటువైపు నడిచాడు. అతడికి ఎర్ర శాలువాలు కప్పి పుష్పగుచ్చాలతో కుటుంబ సభ్యు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా సుర్జీత్ ఎంతో ఉద్వేగానికి లోనయ్యాడు. ‘30 ఏళ్ళ తరువాత నా పిల్లలను కలుసుకోనుండడం నాకెంతో సంతోషంగా ఉందని’ అన్నాడు.
పాకిస్తాన్ జైలులో ఖైదీగా తానెలాంటి ఇబ్బందులను ఎదుర్కోలేదని సుర్జీత్ చెప్పుకొచ్చాడు. తిండికి బట్టకు లోటులేకుండానే గడిపాన్నాడు. మరణశిక్షకు గురైన సింగ్ను లాహోర్లో ఖైదీగా ఉంచారు. ఉరికంబం వరకూ వెళ్లి విముక్తిపొందిన సుర్జిత్ను ‘మీ కుటుంబ సభ్యులకు ఏదైనా సందేశం ఇస్తారా?’ అన్న ప్రశ్నకు లేదు అని సమాధానం ఇచ్చాడు. 1980లో గూఢచర్యం అభియోగంపై అరెస్టయిన సుర్జీత్కు పాకిస్తాన్ సైనిక చట్టం కింద మరణశిక్ష పడింది. అయితే 1989లో అప్పటి అధ్యక్షుడు గులాం ఇషాక్ఖాన్ మరణశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాడు. భారత్ విదేశీమంత్రిత్వశాఖ పలుదఫాలుగా జరిపిన చర్చలు ఫలించి సుర్జీత్ విడుదలకు దారితీసింది. కాగా పాకిస్తాన్ భద్రతా సిబ్బంది సుర్జీత్సింగ్ను వెంటబెట్టుకుని వచ్చి సరిహద్దులో భారత్ అధికారులకు అప్పగించారు. సింగ్ భారత్లోకి ప్రవేశించే క్షణాల్లో అతడి భార్య హర్బన్స్ కౌర్, కుమారుడు కుల్విందర్ సింగ్, కోడలు, మనుమలు, గ్రామస్థులు కేరింతలు కొట్టారు. గ్రామానికి చేరుకున్న వెంటనే స్వర్ణదేవాలయం దర్శించనున్నట్టు తెలిపాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more