దేశంలోని పలు సిమెంట్ కంపెనీలు కుమ్మక్కు అయి కొనుగోలు దార్లను భారీగా దోపిడి చేశాయి. ఈ కంపెనీలన్నీ జట్టుగా ఏర్పాడి ధరను పెంచి అమ్మకాలు చేసిన విధానాన్ని భారత కాంపిటీషన్ కమిషను గుర్తిం చింది. 2002 కాంపిటీషను చట్టంలోని పలు నిబంధనలను ఉల్లంఘించిన తీరును కనుగొంది. పోటీని నివారించే ఒప్పందాలు, స్వీయ ప్రయోజనాల కోసం కంపెనీలు కుమ్మక్కవడం వంటి అంశా లను కాంపిటీషను కమిషను పరిశీలి స్తుంది. భారత బిల్డర్ల సంఘం దాఖలు పరిచిన సమాచారం ఆధారంగా కమిషను డైరెక్టర్ జనరల్ దర్యాప్తు జరిపారు. ఈ విచారణలో 11 సిమెంటు ఉత్పత్తి కంపెనీలు చట్ట ధిక్కారానికి పాల్పడ్డాయని గుర్తించారు. ఇందుకుగాను ఆయా 11 కంపెనీలకు రూ.6000 కోట్ల జరిమాన విధిస్తున్నట్లు ప్రకటిం చారు. అదే క్రమంలో సిమెంటు ఉత్పత్తిదారుల సంఘానికీ జరిమాన విధిస్తున్నట్లు ప్రకటించారు. జరిమాన మొత్తాన్ని 90 రోజుల గడవులోగా కమిషనుకు జమ చేయాలని ఆదేశించారు. మార్కెట్లో లావాదేవీలన్నిటినీ తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. 2009-10, 2010-11 ఆర్ధిక సంవత్సరాలకు సంబంధించిన తమ వార్షికాదాయాలను నిజ ఆదాయాల కన్నా 0.5 రెట్లు అధికంగా చేసి ఈ 11కంపెనీలు చూపాయని కమిషనుకు దాఖలు పరిచిన సమాచారంలో బిల్డర్లు పేర్కొన్నారు.
జరిమాన విధింపునకు గురయిన కంపెనీల జాబితాలో ఎసిసి, అంబూజ, ఆల్ట్రటెక్, దీంతోనే విలీనమైన గ్రసీం, జెకె, ఇండియా, మద్రాసు, సెంచురీ, బినానీ, లఫర్జీ ఇండియా, జేపీ సిమెంటు కంపెనీలు ఉన్నాయి. మార్కెట్లోకి సిమెంటు సరఫరా చేసే విషయం లోనూ, దాని ధరను నిర్ణయించే విషయంలోను ఈ కంపెనీలన్నీ ఏకరూప సమన్వయ ధోరణిని అవలంబించాయని కమిషను వ్యాఖ్యానించింది. మార్కెట్లో డిమాండ్ అధికంగా ఉన్న సమయాన్ని సరఫరా తగ్గింపుకు ధరల పెరుగుదలకు అనుకూలంగా వాడుకోలేకపోయాయని కంపెనీల తీరును కమిషను ఆక్షేపించింది. మార్కెట్లోకి సిమెంటు సరఫరాలను పరిమితం చేయడంలోనూ, ధరలను నిర్ణయించడం- నియంత్రిం చడంలోనూ కుమ్మక్కయిన కంపెనీలు వ్యవహరించిన తీరు నేరుగా వినియోగ దారుల ప్రయోజనాలకు భంగకరంగా నిలిచిందని కమిషను తప్పు పట్టింది. పరోక్షంగా మొత్తం ఆర్ధిక వ్యవస్థనే కుదిపేసిందని తెలిపింది. దేశ పురోభివృద్ధి, ఆర్దిక వ్యవస్థల్లో అతి కీలక మైన నిర్మాణ, మౌలిక సదుపాయాల రంగంలో సిమెంటు అనేది చాల ముఖ్యమైనందున ఆయా కంపెనీల వ్యవహారశైలి నష్టదాయకంగా పరిణమించిందని కమిషను వ్యాఖ్యానించింది. కాగా ఉత్పత్తి, సరఫరా, టోకు-చిల్లర ధరలకు సంబంధించిన సమాచారాన్ని తమలో తాము పంచుకోరాదని సిమెంటు ఉత్పత్తిదారుల సంఘాన్ని(సిఎంఎ) కమిషను ఆదేశించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more