Hyderabadi killed in uganda

Death mystery, Hyderabadi, Uganda, job, killed

Death mystery of Hyderabadi in Uganda.

Hyderabadi Killed in Uganda.gif

Posted: 06/22/2012 12:36 PM IST
Hyderabadi killed in uganda

పొట్టకూటి కూటి కోసం విదేశాలకు వెళుతున్న కార్మికుల పై రోజు రోజుకు దాడులు పెరిగిపోతున్నాయి. ఇక్కడి నుండి వెళ్ళిన తెలుగు వాళ్ళకు అక్కడ రక్షణ ఉండటం లేదు. గతంలో ఎందరో భారతీయులు ఇలాంటి ఘటనల్లో చనిపోయారు. నిన్న హైదరాబాద్ కి చెందిన రాజేందర్ రెడ్డి ఉగాండ దేశంలో సజీవదహనానికి గురయ్యాడు. వివరాల్లోకి వెళితే... రాజేందర్ రెడ్డి తల్లిదండ్రులు కొన్ని సంవత్సరాల క్రితం హైరాబాద్ లోని ఎల్.బి నగర్ ప్రాంతానికి నల్లొండ జిల్లా పోచంపల్లి నుండి వచ్చి స్థిరపడ్డారు. ఇక్కడ రాజేందర్ రెడ్డి బోల్ వెల్ ఆపరేటర్ గా చేసేవాడు. ఈ క్రమంలో సికింద్రాబాద్ తార్నాకకి చెందిన వెంకటేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఉగాండలో బోర్ వెల్స్ నిర్వహిస్తుండే వాడు. అక్కడ ఆపరేటర్ అవసరమై రాజేందర్ రెడ్డిని 4 నెలల క్రితం అక్కడికి తీసుకెళ్లాడు.

ఏమైందో ఏమో గానీ, గురువారం ఉదయాన్నే బోరు బండ్ల యజమాని వెంకటేశ్వరరెడ్డి బావమరిది ప్రభాకర్‌రెడ్డి రాజేందర్ రెడ్డి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి అతను అగ్నిప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. మధ్యాహ్నం మరొకసారి ఫోన్ చేసి రాజేందర్‌రెడ్డి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని, ప్రస్తుతం అతని పరిస్థితి సీరియస్‌గా ఉందని చెప్పారు. అయితే యాజమాని చెప్పే మాటలకు, తోటి కార్మికులు చెప్పే మాటలకు పొంతన లేకపోవడంతో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. రాజేందర్ రెడ్డికి భార్య రాణి, కుమారులు రేవంత్‌రెడ్డి, చరణ్‌రెడ్డి ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Veg juices keep jagan fit
Competition panel slaps rs 6300 cr fine on 11 cement makers  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles