అనంతపురం జిల్లాలోని పెనుకొండ రైల్వేస్టేషన్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 24కు చేరింది. 17 మంది సజీవదహనం కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఏడుగురు మృతి చెందారు. ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. ట్రైన్ డ్రైవర్ కూడా మృతి చెందారు. ఆగివున్న గూడ్స్ రైలును హంపి ఎక్స్ప్రెస్ ఢీ కొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
హుబ్లీ నుంచి బెంగళూరు వెళ్తున్న హంపి ఎక్స్ ప్రెస్ పెనుగొండ రైల్వే స్టేషన్లో ఆగివున్న గూడ్స్రైలును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గూడ్స్ ను ఢీకొన్న వెంటనే హంపి ఎక్స్ప్రెస్కు చెందిన నాలుగు బోగీలు పట్టాలు తప్పగా రెండు బోగీలు మంటల్లో చిక్కుకున్నాయి. భోగీల్లో మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో కొందరు ప్రయాణికులు సజీవదహం అయ్యారు. ఈ ప్రమాదానికి మానవ తప్పిదమే కారణంగా భావిస్తున్నారు. ఆగివున్న గూడ్స్ ట్రాక్ పైకి హంపి ఎక్స్ ప్రెస్ ని అనుమతించడమే దీనికి కారణంగా చెబుతున్నారు.
ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర దిగ్భాంత్రి వ్యక్తం చేస్తూ, సహాయ చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. సంఘటనా స్థలాన్ని ఎంపీలు చిరరంజీవి, మంత్రులు శైలజానాథ్, రఘువీరా రెడ్డి సందర్శించి బాధితులను పరామర్శించారు. ఈ ప్రమాదం పై కేంద్ర రైల్వే మంత్రి ముఖుల్ రాయ్ మరణించిన వారికి 5 ఎక్స్ గ్రేషియా, క్షతగాత్రులకు లక్ష రూపాయలు, స్వల్పంగా గాయపడిన వారికి 50 వేల రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more