కిలో రెండు రూపాయల బియ్యం అమలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రస్తుతం రూపాయికే ఇస్తోందని, తెలుగుదేశం అధికారంలోకి వస్తే అవసరమైతే ఉచితంగానే బియ్యం అందిస్తుందన్న విషయాన్ని ప్రజలకు చెప్పాలని కార్యకర్తలకు సూచించారు. నగదు బదిలీ పథకాన్ని అమలుచేసే సత్తా తెలుగుదేశం పార్టీకే ఉందన్నారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే పేద వర్గాలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తుందని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు హామీ ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.
ప్రచారానికి ఇంకా 20 రోజుల సమయమే ఉందని, కాలాన్ని జాగ్రత్తగా వినియోగించుకుని పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కేవలం కొంతమందికి మాత్రమే సంక్షేమ పథకాలు అమలుచేసేలా కాకుండా, అర్హులందరికీ అందేలా నగదు బదిలీ పథకాన్ని అమలు చేయాలన్నదే పార్టీ లక్ష్యమన్నారు. పార్టీ అధికారంలోకి వస్తే పెన్షన్లను రూ.500కు పెంచుతామని, 60ఏళ్లు దాటిన వారికి రూ.500 పెన్షన్తోపాటు, నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తామన్నారు. విద్యార్థులకు ఫీజు రియింబర్స్మెంట్, నిరుద్యోగులకు రూ.1000 భృతి అందిస్తామన్నారు. పేద వర్గాలకు ఆస్తిని కల్పించే విధంగా మూడు సెంట్ల స్థలం, అందులో లక్ష రూపాయలతో ఇంటిని నిర్మించే బాధ్యత తీసుకుంటామన్నారు. సంక్షేమ కార్యక్రమాలు అమలుచేసే సత్తా తెలుగుదేశం పార్టీకే ఉందన్న విషయాన్ని ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు బాబు పిలుపునిచ్చారు. దేశం అధికారంలోకి వస్తే వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు చేస్తామన్నారు. రామచంద్రపురంలో మొదట్లో బలహీనంగా ఉన్న తెలుగుదేశం పార్టీ, ఇపుడు రెండు పార్టీలను భయపెట్టే స్థాయికి ఎదిగిందని, విజయం తమదేనని బాబు ధీమా వ్యక్తంచేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more