పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎంసిఏ తీరును తప్పుపట్టారు. అనేక మంది సినీ ప్రముఖులు షారూఖ్కు మద్దతు తెలిపారు. కోల్కతా నైట్రైడర్స్ యజమాని ఖాన్పై ఎంసిఏ నిర్ణయాన్ని పునసమీక్షించాలని మమత విజ్ఞప్తి చేశారు. షారూఖ్ పశ్చిమబెంగాల్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు.బాలీవుడ్ బాద్షా షారూఖ్ఖాన్కు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. వాంఖడే స్టేడియంలో భద్రతా సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించిన ఖాన్పై ముంబయి క్రికెట్ అసోసియేషన్ (ఎంసిఏ) ఐదేళ్ళ నిషేధం విధించింది. ఎంసిఏ చర్యను పలువురు రాజకీయ నాయకులు, బాలీవుడ్ ప్రముఖలు నిరసించారు. ‘దేశ వాణిజ్య రాజధాని ముంబయిని నేనెంతో ప్రేమిస్తాను.
షారూఖ్, సచినే కాదు మహారాష్ట్రీయులను బెంగాల్ ప్రజలు ఎంతో అభిమానిస్తారు. పైగా ఖాన్ మా అంబాసిడర్ కూడాను’ అని మమత స్పష్టం చేశారు. బాద్షాపై నిషేధానికి సంబంధించి దయచేసి పునపరిశీలించాలని ఎంసిఏను ఆమె అభ్యర్థించారు. ఆర్జేడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అయితే ఏకంగా ఐపిఎల్నే రద్దుచేయాలని డిమాండ్ చేశారు. షారూఖ్పై నిషేధం విధించిన అంశాన్ని మీడియా ఆయన దృష్టికి తీసుకురాగా ‘ఐపిఎల్ను మూసేయాలి’ అన్నారు. అనేక వివాదాలకు కేంద్రమవుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ను ఎందుకు కొనసాగించాలని ఆయన ప్రశ్నించారు. అయితే షారూఖ్ వ్యవహారంలో ప్రభుత్వం జోక్యం ఉండదని న్యాయశాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ అన్నారు.
పార్లమెంటు వెలుపల ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ జరిగిన సంఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. ఎంసిఏ వ్యవహారంలో జోక్యం చేసుకునే అధికారం తమకు లేదని అంటూ, షారూఖ్ ఉదంతంపై వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. బాలీవుడ్ మొత్తం షారూఖ్ ఖాన్కు సంపూర్ణ మద్దతు తెలిపింది. ‘షారూఖ్ అందరు తండ్రులులాగే ప్రవర్తించారు. బాధ్యత గల తండ్రిగా ఖాన్ ఆ సమయంలో అలా రియాక్ట్ అయ్యారు’ అని దర్శకుడు కరణ్ జోహార్ వ్యాఖ్యానించారు. ఖహానీ దర్శకుడు సుజయ్ ఘోష్ మాట్లాడుతూ బాద్షా ఎంతో బాధ్యత నెరిగిన తండ్రి అన్నారు.
ఆ సమయంలో ఖాన్ స్థానంలో ఏ తండ్రి ఉన్నా అంతే. అందులో తప్పేమీ లేదు అని దర్శకుడు అనురాగ్ బసు స్పష్టం చేశారు. ఎంసిఏ చర్యను గాయకుడు, సంగీత దర్శకుడు విశాల్ దడ్లానీ తప్పుపట్టారు. కుమార్తెకు జరిగిన అవమానం భరించలేకే తానలా ప్రవర్తించాల్సి వచ్చిందని చెప్పడాన్ని బట్టే ఆయన పెద్ద మనసును అర్థం చేసుకోవచ్చని టివీ నటి రోణిత్ రాయ్ వ్యాఖ్యానించారు. ఖాన్ను ఒక నటుడిగా చూడడం సరికాదు. తండ్రిగా ఆయన ప్రవర్తించిన తీరు న్యాయమేనని నటి సెలీనా జైట్లీ చెప్పారు. జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రమణ్య స్వామి కూడా ఐపిఎల్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more