ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాలకు ఇద్దరు చొప్పున సమన్వయకర్తలను పిసిసి నియమించింది. ఆ సమన్వయకర్తలతో వాయలార్ రవి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వాయలార్ రవి వారినుద్ధేశించి ప్రసంగిస్తూ, కొన్ని సలహాలు, సూచనలు చేశారు. జగన్ను తరచూ విమర్శించాల్సిన పని లేదని అన్నట్లు సమాచారం. తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. జగన్ వైపు పార్టీ నుంచి వాళ్ళు వెళ్ళారు, వీళ్ళు వెళుతున్నారన్న ఆందోళన అవసరం లేదని ఆయన అన్నట్లు తెలిసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, లోక్సభ సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అదే పనిగా విమర్శించి పెద్దవాన్ని చేయకండి అని కేంద్ర మంత్రి, కాంగ్రెస్ రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు వాయలార్ రవి పార్టీ సమన్వయకర్తలకు సూచించారు.
కాంగ్రెస్కు బ్యాంకు ఉందని ఆయన తెలిపారు. అందరూ కలిసి పని చేయాలని ఆయన సూచించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఏనాడూ కాంగ్రెస్కు వ్యతిరేకంగా పని చేయలేదని అన్నారు. జగన్ వైఎస్ కుమారుడు కాబట్టి ఎంతో ప్రాధాన్యం ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీతో వైఎస్ కుటుంబం ఎంతో లబ్ది పొందిందని, ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులే పార్టీని విమర్శిస్తున్నారని ఆయన చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసే విమర్శలను తిప్పికొట్టాలని ఆయన తెలిపారు. సమన్వయకర్తలు తమకు కేటాయించిన నియోజకవర్గాలకు వెళ్ళి, అభ్యర్థులకు భారం కాకుండా, స్వయంగా ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు. అవసరమైతే పిసిసి అధ్యక్షుని దృష్టికి తీసుకెళ్ళాలని ఆయన చెప్పారు. సమన్వయకర్తల సమావేశంలో పాల్గొన్న అనంతరం వాయలార్ రవి చెన్నై బయలుదేరి వెళ్ళారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more