Cm kiran pcc chief botsa and minister kanna fire on jagan

cm kiran pcc chief botsa and minister kanna fire on jagan

cm kiran pcc chief botsa and minister kanna fire on jagan

26.gif

Posted: 05/13/2012 06:07 PM IST
Cm kiran pcc chief botsa and minister kanna fire on jagan

       ముఖ్యమంత్రి కొత్త వాదాన్ని బయటికి తెచ్చారు. కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే  వైఎస్ ను తిట్టినట్లేనని అన్నారు. దీనిద్వారా వైఎస్సార్సీపీ నేతల దూకుడును నిలువరించే ప్రయత్నం చేశారు.   వైఎస్ ను ముప్పై ఏళ్లు ఆదరించిన కాంగ్రెస్ పార్టీని ఆయన కుమారుడు విమర్శిస్తుండటం సిగ్గుచేటన్నారు. కడప జిల్లా రాయచోటి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉపఎన్నికల ప్రచారం నిర్వహించారు. లక్కిరెడ్డిపల్లెలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న సీఎం... జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్సార్ ను కాంగ్రెస్ ముప్పై ఏళ్లు ఆదరించి రెండు సార్లు సిఎం చేస్తే.. ఆ పార్టీనే జగన్ విమర్శిస్తున్నాడన్నారు. పార్టీని, సోనియాను తిడితే వైఎస్ ను విమర్శించినట్లేనన్నారు. అటు చంద్రబాబునూ వదలని సిఎం.. బాబు.. జగన్ లిద్దరూ అబద్దాలు చెప్పడంలో సరిసమానులేనన్నారు.  అమెరికా నుంచి వచ్చిన శ్రీకాంత్ రెడ్డిని గుర్తించి టికెట్ ఇస్తే పార్టీకి ఆయన వెన్నుపోటు పొడిచారని సిఎం అన్నారు.5 ఎన్నికల్లో శ్రీకాంత్ రెడ్డికి బుద్ధి చెప్పి.. కాంగ్రెస్  అభ్యర్థి రాంప్రసాద్ రెడ్డిని గెలిపించాలని కోరారు. సిఎం పర్యటనలో ఎంపి సాయిప్రతాప్, మంత్రులు అహ్మదుల్లా, రామచంద్రయ్య, ఎమ్మెల్యేలు వీరశివారెడ్డి, కమలమ్మ తదితరులు హాజరయ్యారు. అయితే.. మంత్క్రి డిఎల్ రవీంద్రారెడ్డి మాత్రం కార్యక్రమానికి హాజరుకాలేదు.
      అంతే కాదు సీఎంతో పాటు కాంగ్రెస్ సీనియర్లు కూడా జగన్ పై ముప్పేట దాడిని కొనసాగిస్తున్నారు. విమర్శల జోరును పెంచారు. జగన్ స్వార్థం కారణంగానే ఎన్నికలు వచ్చాయని ప్రజలకు చెబుతున్నారు. ఉపఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు తథ్యమని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉపఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకోవడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ నేతలు స్వరం పెంచుతున్నారు. కాంగ్రెస్ పథకాలనే లోగోగా పెట్టుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విధానమేంటో ఇప్పటివరకూ చెప్పలేదని పిసిసి చీఫ్ బొత్స విమర్శించారు. తండ్రి చనిపోయి పక్కన ఉంటే ఆస్తుల లెక్కలు చూసుకున్న జగన్ ను గిన్నిస్ బుక్ లో ఎక్కించాలని ఎద్దేవా చేశారు. అటు జగన్ స్వార్థం కారణంగానే ఉపఎన్నికలు వచ్చాయని మంత్రి కన్నా లక్ష్మినారాయణ అన్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో ప్రచారం నిర్వహించిన ఆయన.. వైఎస్ ఆశయం రాహుల్ గాంధీని ప్రధాని చేయడమన్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mothers day special story
Ysr congress party supports chiru son in law  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles