Dicussions going on in full swing in delhi

dicussions going on in full swing in delhi

dicussions going on in full swing in delhi

15.gif

Posted: 05/01/2012 12:48 PM IST
Dicussions going on in full swing in delhi

       ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ఇంకా ఓ కొలిక్కిరాలేదు. దీనికి సంబంధించి సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి, పీసీసీ చీఫ్ బొత్స సత్యన్నారాయణలకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ గట్టి షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. రాష్ట్ర నాయకత్వం రూపొందించిన జాబితాను చూసిన మేడమ్ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. kiranమళ్లీ చర్చించి గెలుపు గుర్రాలను సిద్ధం చేయాలని సూచించినట్టు సమాచారం. కనీసం సగం మందైనా గెలవకపోతే రాష్ట్రంలో పార్టీలో ఇంకెవరుంటారని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. సోనియా వైఖరితో రంగంలోకి ఆజాద్, వయిలార్ రవి దిగారు. ఆయా నియోజకవర్గాల్లో కుల ప్రాబల్యం బాగా ఉన్నవారికే టికెట్ ఇవ్వాలని ఆజాద్ సూచించినట్లు తెలిసింది. అందుకనుగుణంగా అప్పటికప్పుడు జాబితాలో మార్పులు చేర్పులు చేశారు. ఆ సమయంలో కిరణ్-బొత్సల సమక్షంలోనే జిల్లా నేతలతో ఆజాద్ మాట్లాడారు. వారి అభిప్రాయాలు తీసుకున్నారు.

      ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కొద్దిసేపటి క్రితం (మంగళవారం) ఏపీభవన్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ అభ్యర్థుల జాబితాను నేడు ప్రకటిస్తామని తెలిపారు. అంతకు ముందు సీఎం, బొత్సలను ఎంపీలు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, సాయి ప్రతాప్, జేడీ శీలం కలిశారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Panic incident in east godavari district
Platform ticket to cost rs 5 from today  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles