ప్రస్తుతం దేశంలో 611 విశ్వవిద్యాలయాలు ఉండగా రానున్న ఐదేళ్లలో వాటి సంఖ్యను 1600లకు పెంచాలని భావిస్తున్నామన్నారు ఉన్నత విద్యా రంగ అభివృద్ధి, విస్తరణ కోసం 12వ పంచవర్ష ప్రణాళికా కాలంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) భారీ ప్రణాళికలు రూపొందించింది. ముందెన్నడూ లేని విధంగా వచ్చే ఐదేళ్లకుగాను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖకు రూ.1.84లక్షల కోట్లు కేటాయించిన నేపథ్యంలో ఈ కసరత్తు జరుగుతోంది. రానున్న ఐదేళ్లలో దేశ వ్యాప్తంగా 20 మహిళా విశ్వవిద్యాలయాలు, 14 వరల్డ్ క్లాస్ యూనివర్సిటీలు, 374 మోడల్ డిగ్రీ కాలేజీలు, 1000 పాలిటెక్నిక్స్ ఏర్పాటు చేయనున్నారు.
హైదరాబాద్లో యూజీసీ మెంబర్ ప్రొఫెసర్ డీఎన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రతిపాదనలతో ముందుకు వస్తే రాష్ట్రానికి మరో కొత్త మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు యూజీసీ సిద్ధంగా ఉందని తెలిపారు. అలాగే ప్రతిపాదన వస్తే వరల్డ్ క్లాస్ యూనివర్సిటీ కూడా రానుందన్నారు. రాష్ట్రంలో 20 మోడల్ డిగ్రీ కళాశాలలు ఏర్పాటయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఈ నెల 26న జరిగే యూజీసీ సమావేశంలో వీటిపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
ప్రస్తుతం 15 శాతంగా ఉన్న ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తిని 12వ ప్రణాళిక పూర్తయ్యే నాటికి 25 నుంచి 30 శాతానికి పెంచాలని యూజీసీ నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, మహిళల్లో ఉన్నత విద్యను పెంచే దిశగా కసరత్తు జరుగుతోందని, ఇందుకు అన్ని విధాలా ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు.
అమెరికాలో 3600 వర్సిటీలు, జపాన్లో 2600 వర్సిటీలు, చైనాలో 2800 వర్సిటీలు ఉన్నాయని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఉన్న అఫిలియేషన్ సిస్టంలోనూ మార్పులు తీసుకువస్తామని తెలిపారు. దేశ వ్యాప్తంగా 3 వేల అటానమస్ కాలేజీలు వస్తాయని తెలిపారు. కోర్టు కేసు ఓ కొలిక్కి వస్తే రాష్ట్రానికి మరో 20 కొత్త డీమ్డ్ వర్సిటీలు వచ్చే అవకాశం ఉందన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more