పాక్ మాజీ అధ్యక్షుడు ముషార్రఫ్ 2005లో భారత పర్యటనకు రాగా, ఆయన తర్వాత తిరిగి భారత పర్యటనకు వచ్చారు పాక్ అధినేత జర్దారీ. ఈ సందర్భంగా భారత ప్రధాని మన్మోహన్ సింగ్ తో ఆయన పలు విషయాలపై చర్చించారు. ఎలాంటి ఎజెండా లేని ఈ సమావేశంలో ఇరువురు అగ్రనేతలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించినట్టు సమాచారం.
కాగా పాకిస్థాన్ అధ్యక్షుడు జర్దారీతో నిర్మాణాత్మక, స్నేహపూర్వక చర్చలు జరిపినట్టు ప్రధాని మన్మోహన్ సింగ్ వెల్లడించారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సాధారణ స్థాయికి రావాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. తమ దేశానికి రావాల్సిందిగా జర్దారీ తనను ఆహ్వానించారని, దీనికి తన ఆమోదం తెలిపానని చెప్పారు. జర్దారీతో చర్చలు జరిగిన తీరు పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
అటు జర్దారీ కూడా ఈ భేటీపై ఆనందం వ్యక్తం చేశారు. తాము జరిపిన చర్చలు ఫలవంతం అయ్యాయని జర్దారీ తెలిపారు. భారత్తో సత్సంబంధాలు కోరుకుంటున్నామని చెప్పారు. మన్మోహన్ను త్వరలో పాకిస్థాన్లో కలుస్తామన్న ఆశాభావాన్ని జర్దారీ ఆశాభావం వ్యక్తం చేశారు. అరగంట పాటు చర్చలు జరిపిన తర్వాత ఇరువురు నేతలు మీడియాను ఉద్దేశించి మాట్లాడారు.
ముంబై దాడుల సంఘటనలో ప్రధాన నిందితుడు లష్కరే-తోయిబా వ్యవస్థాపకుల్లో ఒకరైన సయీద్ అంశాన్ని భారత్ లేవనెత్తినట్టు తెలుస్తోంది. సయాద్ ఉదంతం ప్రస్తావనకు రాదని జర్దారీ నిన్న పలికిన మాటలు ఇక్కడ గమనార్హం.
అంతకుముందు పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ తన కుమారుడు బిలావల్తో సహా 40 మంది బృందంతో ప్రత్యేక విమానంలో భారత్ కు విచ్చేశారు. రాజస్థాన్లోని అజ్మీర్ దర్గాను సందర్శించారు. తర్వాత ఢిల్లీ చేరుకుని ప్రధాని మన్మోహన్ సింగ్తో కలిసి మధ్యాహ్న భోజన సమావేశంలో పాల్గొన్నారు. జర్దారీ పర్యటన నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీతో పాటు అజ్మీర్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
...avnk
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more