రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు యధా ప్రకారం అన్యాయమే జరిగింది. పెద్దరాష్ట్రం, అధిక ఆదాయం తీసుకొచ్చే దక్షిణమధ్య రైల్వే మన రాష్ట్రంలో వుంది. అయినా ఎప్పుడూ ఎపిపై శీత కన్ను వేస్తూనే వున్నారు. ఒకటీ, అరా రైళ్ళు లేదా ప్రాజెక్టులు ప్రకటించి కంటినీరు తుడిచారు. కేంద్రానికి ప్రతిపాదనలు పంపించడంలోనే జాప్యం చేసిన కిరణ్ ప్రభుత్వం ఇప్పుడు కొన్నింటి నైనా మంజూరు చేసుకోవడంలో ఘోరంగా విఫలమైంది. మొత్తంమీద రైల్వే బడ్జెట్ను పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్కు తీరని అన్యాయం చేసినట్లు స్పష్టమవుతోంది. రాష్ట్రప్రభుత్వం సహకారం అంది స్తామంటే తూతూమంత్రంగా కొన్ని ప్రాజెక్టులు ప్రకటించారు.
రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో కాకినాడ- పిఠాపురం రైల్వే లైన్ ఏర్పాటు చేయనున్నట్లు రైల్వేమంత్రి దినేష్ త్రివేది వెల్లడించారు. 2012-13 కుగాను రైల్వేబడ్జెట్ ప్రతిప్రాదనలు చేస్తూ కాకినాడ-విశాఖపట్నం మధ్య కోస్టల్ రైల్వే కారిడార్ను అభివృద్ధి చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇందుకు భూమి, తగు నిధులు సమకూర్చడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముం దుకు వచ్చిందని మంత్రి వెల్లడించారు.
మెదక్- అక్కన్నపేట, భద్రాచలం-కొవ్వూరు మధ్య లైన్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. హైదరాబాద్లో ఎంఎంటిసి రెండవ దశ నిర్మాణానికి కావాల్సిన నిధులు కేటాయిస్తామని మంత్రి ప్రకటించారు. రాష్ట్రానికి కొన్ని కొత్త రైల్వే లైన్ల ప్రతిపాదనలు చేశారు. బనగానపల్లి-నంద్యాల, కడప-గంగన పల్లి, రాయదుర్గం-ఆవులదర్గా, కదిరి-పుట్టపర్తి, శ్రీనివాసపురం-మదనపల్లి, చిక్బళ్ళాపూర్- పుట్ట పర్తి, జహీరాబాద్-సికింద్రాబాద్ లైన్లను ప్రతి పాదించారు. రాష్ట్రంలో ఐదు రైల్వే స్టేషన్లను ఆదర్శ స్టేషన్లుగా అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి ప్రకటిం చారు. అందులో సత్తెనపల్లి, వినుకొండ, దువ్వాడ, మాచర్ల, పిడుగురాళ్ళ స్టేషన్లు వున్నాయి. కాజీ పేట-విజయవాడ మూడో లైనును అనుమతి లభించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more