చచ్చిన మనిషిని మళ్లీ చంపడమెందుకు.. ఐదేళ్ల కిందట ఎస్పీ అధినేత ములాయంసింగ్ యాదవ్ను ఉద్దేశించి అప్పట్లో ఘనవిజయం సాధించిన బీఎస్పీ అధినేత్రి మాయావతి చేసిన వ్యాఖ్య ఇది. ఈ వ్యాఖ్య ములాయంను తప్పకుండా వెంటాడి ఉంటుంది. అందుకే ఐదేళ్లు తిరిగేసరికి యూపీ పీఠాన్ని మళ్లీ చేజిక్కించుకొని ఆ వ్యాఖ్యలు చేసిన మాయావతిపై ములాయం బదులు తీర్చుకున్నారు. 39 ఏళ్ల వయసులో ములాయం రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇంజినీర్ నుంచి రాజకీయ నాయకుడిగా అవతారమెత్తిన ఆయన ఎస్పీని పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా పటిష్టపరచడంలో తీవ్రంగా కష్టపడ్డారు. 1977, 0లో లోక్దళ్ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఆయన తొలిసారి 199లో యూపీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
ఆ తర్వాత అక్టోబర్ 7, 1992న సమాజ్వాదీ పార్టీని స్థాపించారు. అప్పట్లో కాంగ్రెస్, జనతాదళ్ మద్దతు మరోసారి సీఎం అయ్యారు. ఆ తర్వాత కేంద్రమంవూతిగా పలు బాధ్యతలు నిర్వహించారు. మళ్లీ 2003 ఎన్నికల్లో ఎస్పీ విజయం సాధించడంతో మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. ఆ తర్వాత 2007 ఎన్నికల్లో అధికారంలోకి మాయావతి రావడంతో ములాయం పని అయిపోయిందనుకున్నారు. 72 ఏళ్ల వయసులోనూ పార్టీని నడిపించడంలో, జన సమీకరణలో ఆయన రాజకీయ చతురత అపారం. తనయుడు అఖిలేశ్కు రాష్ట్ర బాధ్యతలు అప్పగించి సరైన నిర్ణయం తీసుకున్న ఆయన మరోసారి విజయంతో మళ్లీ సీఎం పదవిని చేపట్టబోతున్నారు. విజయం తనొక్కడి క్రెడిట్ కాదని, పార్టీ కార్యకర్తలందరికీ ఇది వర్తిస్తుందని ఆయన విన్రమంగా చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more