తెలంగాణ అంశంలో కొత్త మలుపు. జనవరి లోగా తెలంగాణ వ్యవహారాన్ని తేల్చేందుకు సిద్ధమ వుతోన్న కాంగ్రెస్ నాయకత్వం ఆ మేరకు తన ముందున్న మార్గాలనూ అన్వేషిస్తోంది. అందులో భాగంగానే తెలంగాణ అంశానికి కర్త, కర్మ, క్రియగా భావిస్తోన్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నుంచే మొదటి అడుగు వేయాలని నిర్ణయించింది.ఆ ప్రకారంగా.. వెంటనే ఢిల్లీకి రావాలంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్పటేల్ తాజాగా కేసీఆర్కు ఫోన్ చేసినట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం మొదలయింది. తెలంగాణ ఏర్పాటుపై ఉన్న సాధ్యాసాధ్యాలు, అవాంతరాలు, భాగస్వామ్య పక్షాల అభ్యంతరాలు, సీమాంధ్రలో ఉన్న ఒత్తిళ్లు, తెలంగాణ ప్రజల మనోభావాల వంటి అంశాలన్నీ కేసీఆర్తో చర్చించాలని కాంగ్రెస్ నాయకత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది.
ఒకవేళ తెలంగా ణ ఇవ్వకపోతే ప్రత్యామ్నాయ మార్గాలు ఏమిటన్న అంశంపై కూడా పటేల్ ఆయనతో చర్చించే అవకాశాలున్నాయంటున్నారు. ఈ నెలాఖరులో అఖిలపక్షంతో సమావేశం ఏర్పాటు చేసిన తర్వా త ఏ పరిస్థితులలో తెలంగాణ ఇవ్వ ేకపోతున్నా ము? ఒకవేళ ఇస్తే ఎందుకు ఇస్తున్నా మన్న విష యాన్ని ప్రజలకు, నాయకులకు స్పష్టంగా చెప్పాల న్న కాంగ్రెస్ విధాన నిర్ణయానికి అనుగుణం గానే పటేల్ రాయబారం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
తెలంగాణలో ఎన్ని రాజకీయ పార్టీలు, ఉద్యమ సంస్థలు ఉన్నప్పటికీ కేసీఆర్కు ఉన్నంత ఇమేజ్ వాటిలో ఎవరికీ లేదన్న వాస్తవాన్ని గ్రహించిన కాంగ్రెస్ నాయకత్వం, మొదటి నుంచీ కేసీఆర్తో టచ్లో ఉందంటున్నారు. రాష్ట్ర స్ధాయిలో కాంగ్రెస్, ముఖ్యమంత్రి, మంత్రులకు వ్యతిరేకంగా మాట్లాడు తున్నప్పటికీ, జాతీయ స్థాయిలో మాత్రం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా, ఆమె రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్తో ఎప్పటికప్పుడు సంప్ర దింపులు చేస్తూనే ఉన్నారన్న ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో బాహాటంగానే వినిపిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more