అరుణిమ.. క్రీడారంగంలో అద్భుతంగా రాణిస్తున్న ఈమె జీవితంలో అనుకోకుండా ఓ ప్రమాదం ఎదురైంది. ఆ ప్రమాదం కారణంగా ఆమె నరాలు తెగిపోయి, వెన్నుపూసకు తీవ్ర గాయం కావడంతో ఒక కాలు పోయింది. తన జీవిత లక్ష్యాలను నెరవేర్చుకుందామని ఆశించిన ఆమెకు ఈ ప్రమాదం అడ్డుపడింది. అయినప్పటికీ తన మనస్థైర్యాన్ని కోల్పోకుండా జీవితంలో ఏదోఒకటి సాధించాలనే దృఢసంకల్పంతో ముందుకు నడిచింది. కేవలం ఒక్క కాలితోనే ఎవరెస్ట్ శిఖరాన్నిఅధిరోహించింది. ఆ ఘనత సాధించిన మొదటి మహిళగా ప్రపంచ రికార్డుల్లోకెక్కింది.
జీవిత విశేషాలు :
1988లె ఉత్తర ప్రదేశ్ లోని అంబేద్కర్ జిల్లాలోని ఒక గ్రామంలో అరుణిమ జన్మించింది. ఈమెకు తన బాల్యం నుంచి ఫుట్ బాల్ ఆట అంటే ఇష్టం. ఆ ఆట పట్ల ఈమెకున్న ఆసక్తిని గుర్తించిన ఆమె తల్లిదండ్రులు, స్కూల్లో పీ.టీ సార్ ఆమెను ప్రోత్సహించారు. దీంతో ఆమె వాలీబాల్, ఫుట్బాల్ ఆటల్లో ప్రతిభావంతురాలిగా పేరు తెచ్చుకుంది. అంచెలంచెలుగా ఎదుగుతూ జాతీయ జట్టులో స్థానం దక్కించుకుంది. ఆటలో కొనసాగుతూనే ఆమె ఎం.ఎ. చేసింది. ఎల్.ఎల్.బి చేస్తున్న రోజుల్లో అర్మీ రిక్రూట్ మెంట్ ప్రకటన పత్రికలో చూసి దరఖాస్తు చేసింది. అయితే.. దరఖాస్తులో పుట్టిన తేదీ వివరాలు తప్పుగా పడ్డాయి. ఆ వివరాలను బరేలీలోని ఆర్మీ రిక్రూట్ మెంట్ అధికారులు సవరిస్తారని తెలుసుకున్న ఆమె.. 2011 ఏప్రిల్ 11న లక్నోలో రైలు ఎక్కింది. ఆ ప్రయాణమే ఆమె జీవితాన్ని తలక్రిందులు చేసింది. అది బరేలీ చేరుకునేలోగా అంతా తల క్రిందులయ్యింది. ప్రమాదం జరిగింది.
అరుణిమ రైలు ప్రమాదం :
లక్నో నుంచి ఢిల్లీకి పద్మావతి ఎక్స్ప్రెస్ రైలులో జనరల్ కంపార్టుమెంట్లో అరుణిమ తన ప్రయాణం కొనసాగించింది. అదే కంపార్ట్ మెంటులో కూర్చున్న మరో ముగ్గురు వ్యక్తులు.. బరేలీ సమీపంలో ఆమె మెడలోని బంగారు గొలుసు లాగేందుకు ప్రయత్నించారు. ఆమె ప్రతిఘటించడంతో దుండగలు రైలు నుంచి ఆమెను కిందకు తోసేశారు. అలా కిందపడిపోయిన ఆమె అపస్మారక స్థితిలో వెళ్లిపోయింది. తిరిగి ఆమె కళ్లు తెరిచి చూడగా.. పక్కనే ఓ ట్రాక్ పై తాను పడివున్నట్లుగా గుర్తించింది. పైకి లేచేందుకు ఎంతో ప్రయత్నించింది కానీ.. లేవలేకపోయింది.
ఇంతలోనే ఆ ట్రాక్ పై ట్రైన్ రావడంతో.. అది ఆమె కుడి కాలుపై నుండి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఆమె ఎడమకాలు, తొడ ఎముక తీవ్రంగా దెబ్బతిన్నాయి. రక్తపుమడుగల్లో పడివున్న ఆమెను గమనించిన గ్రామస్తులు.. దగ్గరలో వున్న ఆస్పత్రిలో చేర్చారు. అక్కడి వైద్యులు ఆమె మోకాలు కింది భాగాన్ని తొలగించారు. ఆమె తిరిగి కోలుకోవడానికి చాలాకాలం సమయం పట్టింది. మరోవైపు ఈ ప్రమాదాన్ని పోలీసుశాఖ ఆత్మహత్య గా అనుమానించగా.. అరుణిమ ఆ వాదనలను ఖండించింది.
చికిత్స అనంతరం జీవితం :
బరేలీ హాస్పిటల్ లో అరుణిమకు చికిత్స నిమిత్త ఒక కాలును తీసేసి, ఇంకో కాలికి రాడ్ బిగించారు. శారీరకంగా కోలుకున్నప్పటికీ అరుణిమ మానసికంగా లోలోపలే కుంగిపోయింది. తాను జీవితంలో ఏమీ సాధించలేననంటూ ఆవేదన చెందుతూ వుండేది. ఆ సమయంలో ఈమెకు తన సోదరుడు ఓంప్రకాశ్ ఆమెను ధైర్యంగా నిలిచాడు. ‘రెండుకాళ్లు లేని మార్క్ ఇన్ గ్లిస్ ఎవరెస్ట్ శిఖరాన్ని అవరోధించినప్పుడు దాన్ని నువ్వు కూడా సాధించగలవు’ అంటూ ఆమెలో బలాన్ని పెంచాడు. ఆమెను తనకు తెలిసిన ఓ కోచ్ దగ్గర చేర్చాడు. అరుణిమకు శిక్షణలో భాగంగా 21,725 అడుగుల ఎత్తున్న చమ్సేర్ కంగ్రి శిఖరానికి ఎక్కేసింది. అప్పుడు కోచ్ ఈమెను హత్తుకుని.. నువ్వు ఎవరెస్ట్ శిఖరాన్ని సునాయాసంగా ఎక్కేయగలవంటూ చెప్పడంతో.. ఆమెలో సంకల్పం మరింత పెరిగింది.
టాటాస్టీల్, అడ్వెంచర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎవరెస్టు పర్వతారోహణ బృందం బయలుదేరింది. ఆ బృందంలో ఈమె కూడా వుంది. అందులో భాగంగానే 2013 మొదటివారంలో 20,283 అడుగుల ఎత్తైన సమిట్ ఐలాండ్ శిఖరాన్ని ఈ బృందం అవరోధించింది. దాంతో అరుణిమకు ఆత్మవిశ్వాసం రెట్టిప్పైంది. 29వేల అడుగుల ఎత్తులో వున్న ఎవరెస్టును ఎక్కగలనన్న నమ్మకంతో 2013 ఏప్రిల్ లో ఎవరెస్టు యాత్రను ప్రారంభించింది. పైపైకి సాగిపోయిన అరుణిమ తన ఆశయ శిఖరాన్ని అవరోధించడంలో విజయం సాధించింది. వైకల్యాన్ని అధిగమించి అత్యున్నత శిఖరాన్ని చేరుకున్న తొలిమహిళగా చరిత్ర సృష్టించింది.
(And get your daily news straight to your inbox)
Mar 09 | మహిళా దినోత్సవం రోజున మహిళలకు కీర్తించడంతో వారికి సమాజంలో సగం కాలేరు. అందని ఆకాశంలోనూ సగం వారు పోందలేరు. దీంతో నిజానికి మహిళల్లోని సృజనాత్మకత, పరిపాలన దక్షత, నేర్పరితనం, విధుల పట్ల బాధ్యత అన్ని... Read more
Jan 30 | రావిచెట్టు లక్ష్మీ నరసమ్మ (1872 - అక్టోబర్ 24, 1918) మహిళాభ్యుదయానికీ, మాతృభాషలో విద్యాభివృధ్ధికీ, విజ్ఞాన గ్రంథాల ప్రచురణకు తీవ్రంగా కృషి మహిళామణి. తెలంగాణ విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన రావిచెట్టు రంగారావు సతీమణి.... Read more
Jan 21 | ఆమె పేరు ఈశ్వరి.. అమె మీలో ఎవరు కోటీశ్వరులు షోలో పాల్గోంది. ఈ షోలో అమె పార్టిసిపేట్ చేయడం ద్వారా అమె ఒక్కసారిగా లక్షలాది మంది హృదయాలను గెలుచుకోగలిగింది. షోలో ఎంత గెలుచుకుంది అన్న... Read more
Aug 26 | ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టి కోల్కత్తా మురికివాడల్లోని అభాగ్యుల జీవితాల్లో వెలుగునింపిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిసా.. తోటివారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్నే త్యాగం చేసి, కష్టాల్లో ఉన్నవారికి వెతికి మరీ సాయమందించి... Read more
Dec 29 | దేశవ్యాప్తంగా పిల్లలందరికీ సరైన పోషకాలు వున్న అహారం అందించాలన్నదే అమె అభిమతం. పోషకాలు లేని ఆహారం ఎంత తింటే మాత్రం ఏంటీ లాభం అని తనను తాను ప్రశ్నించుకున్న అమె.. ముందుగా పోషకాలు అందే... Read more