సమాజంలో మహిళలకు సరైన ప్రాధాన్యత లేని రోజుల్లో కొందరు స్త్రీలు తమ సత్తా చాటుకుని ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. పురుషులకు తామూ ఏమాత్రం తీసుకుపోమని నిరూపించారు. అలాంటి మహిళల్లో మొదటగా వినిపించే పేరు ‘మేరీ క్యూరీ’. భౌతిక - రసాయనిక శాస్త్రవేత్త అయిన ఈమె.. రెండు వేరువేరు వైజ్ఞానిక రంగాలలో తాను అందించిన అధ్బుత సేవలకుగానూ రెండు నోబెల్ బహుమతులు గెలుచుకుని రికార్డు నెలకొల్పింది. ఇప్పటివరకు ఏ ఇతర శాస్త్రవేత్తలకు ఇలా ఈ విధంగా రెండు రంగాలలో రెండు బహుమతులు లభించలేదు.
జీవిత విశేషాలు :
1867 నవంబర్ 7వ తేదీన పోలండ్ రాజధాని వార్సాలో బ్రోనిస్లావా - వ్లాడిస్లా స్క్లొడొస్కి అనే పోలీష్ దంపతులకు మేరీ క్యూరీ జన్మించింది. మేరీ క్యూరీ అసలు పేరు మారియా స్ల్కొడొస్క. ఈమె తన చిన్నతనంలోనే సోదరి హెలెనా, తల్లిని కోల్పోయింది. దాంతో కొన్నాళ్లపాటు తీవ్ర దిగ్ర్భాంతికి గురైన మేరీ... తర్వాత చాలా శ్రద్ధతో చదువును కొనసాగించింది. ఆమె తన 15వ ఏటలో తాను చదువుతున్న హైస్కూల్ లో అందరికంటే ఎక్కువ మార్కులు సాధించి ఉత్తీర్ణురాలైంది. అయితే మేరీ అమ్మాయి కావడంవల్లో.. లేక రష్యా-పోలండ్ రాజ్యాల మధ్య గొడవల కారణంగానో తెలియదుకానీ.. అప్పట్లో ఆమెకు విశ్వవిద్యాలయంలో ప్రవేశం దొరకలేదు. దాంతో ఉన్నత విద్యను అభ్యసించాలన్న ఆమెలో మరింతగా పెరిగిపోయింది.
మొదట పిల్లలకు బోధనలు చేస్తూ డబ్బులు సంపాదించడం మొదలుపెట్టింది. ఆ డబ్బులతో ఆమె వార్సాలోని ఫ్లోటింగ్ యూనివర్సిటీలో చదువు కొనసాగిస్తూనే పారిస్ లో వైద్యం అభ్యసిస్తున్న తన సోదరికి అండగా నిలిచింది. 1891లో భోధనలు చేస్తూ కూడుకున్న ధనంతో మేరీ కూడా పారిస్ చేరుకుంది. అక్కడే ఆమె ఉన్నత విద్యను అభ్యసించి తన పరిశోధనలను ప్రారంభించింది. పార్బోన్ లో గణితశాస్త్రం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రాలను అభ్యసింది. 1893 ప్రారంభంలో అండర్ గ్రాడ్యుయెషన్ ను ప్రథమస్థానంలో పూర్తిచేసిన ఆమె.. ఒక సంవత్సరం తర్వాత అదే యూనివర్సిటీలో గణితంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. సార్బోన్ లోనే ఈమె 1909లో ప్రొఫెసర్ గా బాధ్యతలు చేపట్టిన మొట్టమొదటి స్త్రీగా చరిత్రలో నిలిచిపోయింది. 1903లో హెన్రి బెకెరెల్ పర్యవేక్షణలో ESPCI నుండి DSc పొందిన ఆమె... ఫ్రాన్సులో డాక్టరేటు పూర్తి చేసిన మొట్టమొదటి స్త్రీగా మళ్ళీ చరిత్ర సృష్టించారు.
ఇదిలావుండగా... మేరీ సార్బోన్లో వున్న సమయంలో అక్కడే తోటి ఇన్స్ట్రక్టర్ అయిన పియరి క్యూరీని పెళ్ళాడారు. మేరీ తన పరిశోధనలను వివిధ రకాలైన స్టీల్ల అయస్కాంతత్వంతో ప్రారంభించారు. ఈ పరిశోధనల వల్లనే మారియా, పియరి ఒకరినొకరు దగ్గరయ్యారు. తరువాత వారిద్దరు ఈ పరిశోధనలని రేడియోధార్మికతపై ఆరంభించారు. ముఖ్యంగా వారి పరిశోధనలు ‘పిచ్బ్లెండ్’ అనే ఖనిజంపై సాగాయి. ఆ పరిశోధనల నేపథ్యంలోనే వీరిద్దరు ఈ ఖనిజంనుండి వారు యురేనియంను వేరుచేశారు. 1898 కల్లా వారు పిచ్బ్లెండ్లో యురేనియంకన్నా ఎక్కువ రేడియోధార్మికతను కలిగియున్న పదార్థమని నిర్దారించారు. ఈ పరిశోధనలను వాళ్లిద్దరు 1898 డిసెంబరు 26 బయలు పరిచారు.
(And get your daily news straight to your inbox)
Mar 09 | మహిళా దినోత్సవం రోజున మహిళలకు కీర్తించడంతో వారికి సమాజంలో సగం కాలేరు. అందని ఆకాశంలోనూ సగం వారు పోందలేరు. దీంతో నిజానికి మహిళల్లోని సృజనాత్మకత, పరిపాలన దక్షత, నేర్పరితనం, విధుల పట్ల బాధ్యత అన్ని... Read more
Jan 30 | రావిచెట్టు లక్ష్మీ నరసమ్మ (1872 - అక్టోబర్ 24, 1918) మహిళాభ్యుదయానికీ, మాతృభాషలో విద్యాభివృధ్ధికీ, విజ్ఞాన గ్రంథాల ప్రచురణకు తీవ్రంగా కృషి మహిళామణి. తెలంగాణ విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన రావిచెట్టు రంగారావు సతీమణి.... Read more
Jan 21 | ఆమె పేరు ఈశ్వరి.. అమె మీలో ఎవరు కోటీశ్వరులు షోలో పాల్గోంది. ఈ షోలో అమె పార్టిసిపేట్ చేయడం ద్వారా అమె ఒక్కసారిగా లక్షలాది మంది హృదయాలను గెలుచుకోగలిగింది. షోలో ఎంత గెలుచుకుంది అన్న... Read more
Aug 26 | ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టి కోల్కత్తా మురికివాడల్లోని అభాగ్యుల జీవితాల్లో వెలుగునింపిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిసా.. తోటివారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్నే త్యాగం చేసి, కష్టాల్లో ఉన్నవారికి వెతికి మరీ సాయమందించి... Read more
Dec 29 | దేశవ్యాప్తంగా పిల్లలందరికీ సరైన పోషకాలు వున్న అహారం అందించాలన్నదే అమె అభిమతం. పోషకాలు లేని ఆహారం ఎంత తింటే మాత్రం ఏంటీ లాభం అని తనను తాను ప్రశ్నించుకున్న అమె.. ముందుగా పోషకాలు అందే... Read more