Flood threat to meghadri gedda reservoir in visakha

Flood Threat to Meghadri Gedda Reservoir inVisakha, Trains Cancelled due Heavy Rains in State, Heavy Rains in several Districts, Farmers suffering by Heavy Crop Damage

Flood Threat to Meghadri Gedda Reservoir inVisakha, Trains Cancelled due Heavy Rains in State

మేఘాద్రికి వరద ముప్పు-రైతన్నకు పెద్ద కష్టం-రైలు రద్దు

Posted: 10/25/2013 03:28 PM IST
Flood threat to meghadri gedda reservoir in visakha

రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. హౌరా - చెన్నై, దిగా-విశాఖ, పూరి- తిరుపతి, విశాఖ - భువనేశ్వర్ ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ రైలును రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఈరోజు ప్రకటించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పలు జిల్లాల్లో రైలు పట్టాలపై వరద నీరు పోటేత్తుతోంది. రైళ్లను రద్దు చేయడంతో ప్రయాణీకులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

 

మేఘాద్రి గడ్డకు ముప్పు..

మేఘాద్రి గడ్డకు వరద ముప్పు వాటిల్లనుందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీని కారణంగా నగరంలోని షీలానగర్, నవర, ఎయిర్ పోర్టు ప్రాంతాల ప్రజలకు వరద ముప్పు రానుందని అధికారులు తెలిపారు. నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రిజర్వాయర్లలోకి అత్యధికంగా నీరు వచ్చి చేరింది. జలాశయాలు నిండుకుండలా మారిపోయాయి. దీంతో అధికారులు గేట్లు ఎత్తివేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

 

కన్నీరు పెట్టిన రైతు

రైతన్నకు పెద్ద కష్టం వచ్చింది. భారీ వర్షాలు రైతులను అగాధంలోకి నెట్టిపడేశాయి. తమ కళ్లేదుటే పంట పోలాలు నీట మునుగుతున్నా ఏమి చేయలేకపోయారు. చేతికి అందాల్సిన పంట నీట మునిగిపోతుండడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. భారీ వర్షాలు కురుస్తుండడంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులను తలపిస్తున్న పంట పొలాలను చూసి రైతులు బావురుమంటున్నారు.

రైవాడ యడమ కాలువ గట్టు తెగిపోవడంతో వందలాది ఎకరాల పంట నీటిపాలైంది. జిల్లా వ్యాప్తంగా 5వేల 247 హెక్టార్లలలో వరి పంట నీట మునిగింది. 770 హెక్టార్లలో చెరకు పంట దెబ్బతింది. 515 హెక్టార్లలోని ఉద్యానవన పంట భారీ నష్టం ఏర్పడింది. కుంటలు, చెరువులు నిండిపోయాయి. పొలాలన్నీ నీట మునిగిపోయాయి. వేరు శనగ పంట పూర్తిగి దెబ్బతింది. చేతికొచ్చిన పంట నాశనమైపోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Workers strike at visakhapatnam port

    ఏజెన్సీలో చలి పులి- విశాఖ పోర్టులో మోగిన సమ్మె సైరన్

    Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more

  • Minister balaraju fire on t bill

    టి-బిల్లును-దిగ్విజయ్ ను అడ్డుకుంటాం :మంత్రి బాలరాజు

    Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more

  • Student jac egg attacks on purandeswari

    కోడిగుడ్ల దాడి- బాధాకరం- పురంధేశ్వరి

    Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more

  • Lehar cyclone effect to coastal ap

    విశాఖ తీరం వద్ద లెహర్ తీరం దాటే అవకాశం

    Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more

  • Kishore chandra deo wants vizag to be seemandhra capital

    ఆంధ్ర రాజదాని పై కిషోర్ చంద్రదేవ్ పోరాటం

    Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more