ఫైలిన్ తుఫాను కారణంగా కోస్తా జిల్లాల్లో ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా అన్ని చర్యలు చేపట్టామని రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. తుఫాను ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాలపై అధికంగా ఉంటుందన్న వాతావరణ శాఖ సమాచారం మేరకు పరిస్థితిని దగ్గరుండి సమీక్షించేందుకు ఆయన ఈరోజు ఉదయం విశాఖపట్నం వచ్చారు. తుఫాను హెచ్చరికల కేంద్రం, కైలాసగిరిపై డాప్లర్ రాడార్ కేంద్రాలను సందర్శించి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఫిషింగ్ హార్బర్లో గోడ కూలిపోయిందని తెలిసి అక్కడికి వెళ్లి పరిస్థితిని గమనించారు. అధైర్య పడవద్దని మత్స్యకారులకు భరోసా ఇచ్చారు. విశాఖపట్నానికి చెందిన 48 మంది మత్స్యకారులు ఆరు బోట్లలో వేటకు వెళ్లి పరదీప్ దగ్గర చిక్కుకుపోయారని తెలిసి, వెంటనే అక్కడి పోర్టు అధికారులతో మాట్లాడి, వారికి ఆశ్రయం కల్పించాలని సూచించారు.
అనంతరం కలెక్టర్ కార్యాలయంలో తుఫాను ప్రత్యేక అధికారి హరిప్రీత్సింగ్, కలెక్టర్ అరోఖ్యరాజ్, జేసీ ప్రవీణ్కుమార్, జీవీఎంసీ కమిషనర్ సత్యనారాయణ, పోలీస్ కమిషనర్ శివధర్రెడ్డి, జిల్లా ఎస్పీ విక్రమజిత్ దుగ్గల్, ఈపీడీసీఎల్ సీఎండీ శేషగిరిబాబులతో సమావేశమయ్యారు. సమస్యాత్మక ప్రాంతాలను ప్రజలను సురక్షితంగా తరలించి, పునరావాస కేంద్రాల్లో వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. రిజర్వాయర్లు, నదీ పరివాహక ప్రాంతాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
విశాఖపట్నం జిల్లాలో 62 లోతట్టు ప్రాంతాల ప్రజలను 72 పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేశామన్నారు. వారికి అక్కడ ఆహారం, నీరు, విద్యుత్ అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారన్నారు. 1996 తరువాత వచ్చిన తుఫానుల్లో ఇదే పెద్దదన్నారు. అన్ని శాఖల సిబ్బంది నిర్లక్ష్యాన్ని వీడి అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని మంత్రి పిలుపునిచ్చారు. తాగునీరు, నీటిపారుదల, విద్యుత్తు శాఖల సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని..ఎక్కడ ఎటువంటి ఫిర్యాదు వచ్చినా తక్షణమే తగిన సాయం అందించాలని మంత్రి సూచించారు. ఎక్కడైనా ఏదైనా నష్టం జరిగితే ప్రభుత్వం వారికి తగిన సాయం చేస్తుందన్నారు. మధ్యాహ్నం శ్రీకాకుళం జిల్లా వెళ్లి అక్కడి పరిస్థితిని తెలుసుకుంటానని, అక్కడి నుంచి రాత్రికి మళ్లీ విశాఖ వచ్చి ఇక్కడే రెండు రోజులు ఉంటామని మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు.
విశాఖలో మత్య్సకారుల ఇళ్లు నేలమట్టం
ఫైలిన్ తుపాను తన ప్రతాపం చూపెడుతోంది. విశాఖ శివసాయినగర్ లో సముద్రం ముందుకు వచ్చింది. దీంతో పదుల సంఖ్యలో మత్య్సకారుల ఇళ్లు నేలమట్టమయ్యాయి. తీరం భారీగా కోతకు గురైంది. మత్య్సకారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలు తీరాన్ని చిన్నాభిన్నం చేశాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా తుపాను బీభత్సం సృష్టించడంతో మత్య్సకారులు భయాందోళనకు గురవుతున్నారు. సముద్రపు అలలు రెండు మీటర్ల ఎత్తున ఎగసిపడుతున్నాయి.
భీమిలి బీచ్ లో కూలిన రక్షణ గోడ
ఫైలిన్ తుపాను ధాటికి అలలు ఎగసిపడుతున్నాయి. దీంతో భీమిలి బీచ్ వద్ద 80 అడుగుల మేర రక్షణ గోడ కూలిపోయింది. ప్రమాదం జరిగే అవకాశం ఉండటంతో రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఇసుక బస్తాలు వేసి రక్షణ గోడను నిర్మిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more
Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more
Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more
Nov 25 | అండమాన్లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more
Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more