విధుల బహిష్కరణ
కేసిఆర్ వ్యాఖ్యలకు నిరసనగా విజయవాడ సహ క్రిష్ణా జిల్లా వ్యాప్తంగా ఎన్జీవోలు విధులు బహిష్కరించారు. సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఉదయం 11 గంటలకు ఎన్జీవోలు మహాధర్నా చేపట్టనున్నారు. సమైక్యవాదులు హనుమాన్ జంక్షన్ లో సమైక్యాంధ్రకు మద్దతుగా రిలే దీక్షలు చేపట్టారు. జగ్గయ్య పేటలో ఢిపోల నుంచి బస్సులను బయటకు రాకుండా సమైక్యవాదులు అడ్డున్నారు.
నిరసన జ్వాలలు
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మూడవరోజు కూడా సీమాంధ్ర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు ఎగసిపడుతున్నాయి. విజయవాడలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.కాంగ్రెస్ నేతలు పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. జాతీయ రహదారిపై మానవహారంగా మారి నిరసన తెలిపారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులంతా రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానం సమైక్యవాదానికి అనుకూలంగా నిర్ణయం తీసుకునేంత వరకు ఆందోళనలు కొనసాగుతాయన్నారు. రాష్ట్ర విభజనపై తిరుపతిలో నిరసన జ్వాలలు రగుతూనే వున్నాయి. ఆటో డ్రైవర్లకు కూడా నిరసన గళం విప్పారు. తమ స్వలాభం కోసం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించిందని వారు మండిపడ్డారు. విభజనను వ్యతిరేకిస్తూ దిష్టిబొమ్మను దగ్దం చేశారు. సోనియా, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రరూపం దాలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు 3 రోజుకూడా డిపోలకు పరిమితమయ్యాయి. వాణిజ్య సంస్థలు, దుకాణాలు మూతబడ్డాయి. ప్రైవేట్ స్కూళ్ల అసోషియేషన్ వరుసగా మూడోరోజు స్కూళ్లకు సెలవు ప్రకటించింది. బంద్తో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. జనజీవనం స్తంభించింది.
పెరిగిన పోలీసు బలగాలు
విజయవాడ నగరంలో పోలీసు బలగాల సంఖ్య మరింతగా పెరిగింది. సమైఖ్యనినాదంతో నగరంలో ఆంధోనలు పెరిగన నేపధ్యంలో పోలీసులు పికెట్లు పెంచటంతోపాటు అదనంగ రంగంలోకి బలగాల్ని దింపారు. రాష్ట్ర విభజన ప్రకటన సమయం నుంచి నగరంలో శాంతియుత మార్గంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీంతో గత మూడు రోజులుగా నగరంలో పోలీసుల పహరా పెరిగింది. ఇప్పటికే రంగంలో 900 మంది పోలీసులు ఉన్నారు. అయితే ఉద్యమ తీవ్రత మరింత పెరుగుతుండటం, విద్యార్ధి, ఉద్యోగ సంఘూలు ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తాజాగా సీమాంధ్ర అధికార, పత్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలనే డిమాండ్తో వివిధసంఘూలు రాజకీయ పార్టీలు ఆందోళనలు సాగిస్తున్నారు. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేల నివాసాలు, కార్యాలయాల ముట్టడి కార్యక్రమాలు ముమ్మరమయ్యాయి. దీంతో విజయవాడ నగరంలోకి పికెట్లు, వీఐపీ నివాసాల వద్ద బందోబస్తును పెంచారు. కేంద్రం నుంచి ప్రత్యేక బలగాలు రంగలోకి దిగాయి.
(And get your daily news straight to your inbox)
Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more
Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more
Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more
Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more
Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్కు ఏపీఎన్జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్జీవోల భవన్లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more