మధరపూడి ఎయిర్ పోర్టులోకి దూసుకెళ్ళి ఎంపి హర్షకుమార్ తనయుడు శ్రీరాజ్ హల్ చల్ చేశారు. ఎయిర్ పోర్టులో సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేస్తూ టైర్లను తగులబెట్టి నిరసన తెలిపారు. విభజనతో ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని ఈ సందర్భంగా ఆయన అన్నారు. దీంతో ఎయిర్ పోర్టులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు ఈ ఘటనను అడ్డుకున్నారు.
న్యాయవాదుల ధర్నా
సమైక్యాంద్రకు మద్దతుగా నందిగామలో పలు కళాశాల విద్యార్థులు, న్యాయవాదులు తహశీల్థార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. విభజనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం తహశీల్థార్ నాగేశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు. తర్వాత గాంధీ సెంటర్ లో రాష్ట్రాన్ని సమైక్యాంగా ఉంచాలని కోరుతూ విద్యార్థులు, న్యాయవాదులు మానవహారం నిర్వహించారు.
నగర్ బంద్
రాష్ట్రం విభజనను నిరసిస్తూ విజయవాడ ఆటోనగర్ లోని కార్మిక సంఘాలు బంద్ పాటిస్తున్నాయి. ఆటోనగర్ లో మెకానిక్ షెడ్ లు, పరిశ్రమలు, పౌండ్రీలు లను మూసివేశారు. వాహనాలు రాకుండా రహదారులను దిగ్బందనం చేసి లారీ టైర్లు తగులబెట్టారు.
స్వరీస్ రద్దు
గన్నవరం విమనాశ్రయానికి ప్రతిరోజు బెంగలూరు నుంచి జెట్ ఎయిర్ వేస్ విమాన సర్వీసు రాకపోకలు జరిగేవి. అయితే ఈ రోజు సాంకేతిక కారణాల వల్ల రధ్దయింది. బెంగళూరు నుంచి ప్రతి రోజు ఉదయం 7.45 గంటకు జెట్ ఎయిర్ వేస్ విమానం గన్నవరం చేరుకుంటుంది. మరళ తిరిగి 8.15 గంటలకు బెంగళూరు వెళుతుంది. ముందుస్తు సమాచారం లేకుండా ఈ సర్వీసు రద్దు కావడంతో బెంగళూరు వెళ్లేందుకు వచ్చిన ప్రయాణికులు నిరాశతో ఇంటి ముఖం పట్టారు.
నామినేషన్ వేసిన అంబటి
అవనిగడ్డ అసెంబ్లీ స్థానానికి జరుగనున్న ఉప ఎన్నికలల్లో టిడిపి అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే అంబటి బ్రహ్మణయ్య తనయుడు అంబటి శ్రీహరి ప్రసాద్ ఈ రోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు. గురువారం నియోజకవర్గం పార్టీ శ్రేణులతో ర్యాలీ నిర్వహించి అవనిగడ్డలో నామినేషన్ దాఖలు చేయనున్నట్లు శ్రీహరిప్రసాద్ తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more
Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more
Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more
Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more
Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్కు ఏపీఎన్జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్జీవోల భవన్లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more