Vijayawada durga

1060 g o cancel.png

Posted: 04/03/2010 06:08 PM IST
Vijayawada durga

విజయవాడ, మేజర్‌న్యూస్‌ : సమాజంలో వున్న కుల వివక్షతను రూపుమాపేందుకు ప్రభుత్వం దళిత గోవిందాన్ని ప్రొత్సహిస్తుంటే, ఇంద్రకీలాద్రిపై వేంచ ేసియున్న శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో కుల వివక్షతను ప్రొత్సహించే విధంగా అధికారులు వ్యవహరించడం సిగ్గు చేటని కుల వివక్ష వ్యతిరేక ప్రచార చైతన్య సంఘం జిల్లా కన్వీనర్‌ పరిశపోగు లాజరస్‌(రాజేష్‌) అన్నారు.
కులవివక్షతను కొనసాగించే 1060 జీఓను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని కోరుతూ గురువారం ఉదయం శ్రీ కన కదుర్గ అమ్మవారి ఘాట్‌రోడ్డు కుల వివక్ష వ్యతిరేక ప్రచార చైతన్య సంఘం ఆధ్వర్యంలో ఎస్‌సి, ఎస్‌టి, బిసి సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నానుద్దేశించి ఆయన మాట్లాడుతూ అమ్మవారి దేవస్థానంలో లడ్డుల తయారీ బ్రాహ్మణులు మాత్ర మే తయారు చేయాలని 1060జీఓను అమలు చేయడం సిగ్గుచేటన్నారు. బిసి ఐక్యవేదిక నాయ కులు బుద్దా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు వ్యతిరేకంగా ఈ జీఓను వెంటనే ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.
ఎంఆర్‌పిఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు పేరుపోగు వెంక టేశ్వరరావు మాదిగ మాట్లాడుతూ కులవివక్షతను, అంటరానితనాన్ని నిర్మూలించడానికి పాలకులు చట్టాలను సక్రమంగా అమలు చేయకుండా బ్రాహ్మ ణులకు పెద్ద పీటను వేసి బ్రాహ్మణేతర కులాలను పనిలోంచి తొలగించి రాజ్యాంగ విరుద్ధమైన జీఓను అమలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ జీఓను తక్షణం రద్దు చేయకపోతే ఎస్‌సి, ఎస్‌టి, బిసి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద యెత్తున ఉద్యమాలు చేపడతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు దాసరి జైరాజ్‌, సువ్వారి రాంబాబు, ద్రవిడ సత్తా నాయకులు పాకలపాటి రత్నరాజు, ఎంఆర్‌పిఎస్‌ నగర నాయకులు మానికొండ శ్రీధర్‌ మాదిగ, కామెళ్ళ దేవమణి, భూతపాటి ఫిల్‌మెన్‌ కుమార్‌, బిఎస్‌పి నాయకులు బండ్లమూడి సూర్యప్రకాశరావు, కెవి కోటేశ్వరరావు తదితర దళిత, బిసి సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వామపక్షాల మనుగడ కోసమే... వామపక్షాల మనుగడ కోసమే దుర్గగుడిలో రెండు రోజుల నుంచి నానాయాగి చేస్తున్నారని పిసిసి ప్రధా నకార్యదర్శి కొలను కొండ శివాజీ ఆరోపించారు. గురువారం జిల్లా మంత్రి పార్థసారధి,జిల్లా ఇన్‌ఛార్జీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలను కలిసి పరిస్థి తిని వివరించినట్లు ఆయన తెలిపారు. దళితుల వద్దకే భగవంతుడు, భజగోవిందం వంటి కార్య క్రమాలను నిర్వహిస్తున్న ప్రభుత్వం దుర్గగుడిపై అన్యులు ప్రసాదం తయారీలో పాల్గొన కూడదంటూ జారీ చేసిన జీఓను రద్దు చేయాలని మంత్రులకు వివరించినట్లు ఆయన తెలిపారు.దీనిపై స్పందిం చిన మంత్రులు సంబంధిత మంత్రితో, అధికా రులతో చర్చించి జీఓ రద్దుకు కృషిచేస్తామని చెప్పారని కొలనుకొండ శివాజీ తెలిపారు.
లడ్డు తయారీలో కుల వివక్షత తగదు : ఒపిడిఆర్‌ గత 12 సంవత్సరాలుగా శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలోత లడ్డు, ప్రసాదాల తయారీలో పని చేస్తున్న బ్రాహ్మణేతర వారిని తొలగించి, బ్రాహ్మ ణులను మాత్రమే తీసుకుంటామంటూ కులవివక్షత చూపించడాన్ని ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ(ఓపిడిఆర్‌) నాయకులు కె.ఎస్‌ తీవ్రంగా ఖం డించారు. బిసి కార్మికులను లడ్డు తయారీ నుంచి తొలగించడమంటే రాజ్యాంగం పొందుపరిచిన ఆదేశిక సూత్రాలను ఉల్లంఘించడమేనన్నారు. తక్షణమే ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేయాలని,జీఓ రద్దు చేసే వరకు కార్మికులకు మద్ద తుగా ఉద్యమం చేపడతామని ఆయన పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  131png
Vijayawada youth  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vangaveeti radha get emotional at vijayawada

    ఘనంగా వంగవీటి రంగ వర్థంతి

    Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more

  • Who is the samaikyandhra hero

    వీరిలో సమైక్య హీరో ఎవరు ?

    Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more

  • Vijayawada municipality fails to pay employees their salaries

    ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ-వేతనాలివ్వండి మహాప్రభో.

    Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more

  • Cm kiran fire on congress high command

    ఒక్కసారి చదువుకోండి:సిఎం కిరణ్

    Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more

  • Ashok babu fire on seemandhra leaders

    చేతకానితనం వల్లే ఇలా జరిగింది?

    Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more