'బస్స్టేషన్లో సీసీ కెమెరాల ఏర్పాటు విప్లవాత్మక పరిణామమని నగర పోలీసు కమిషనర్ రాజేంద్రనాథ్రెడ్డి అన్నారు. ఆర్టీసీ బాటలోనే వర్తక, వాణిజ్య వర్గాలు, బ్యాంకులు, ఇతర సంస్థలు ముందుకు వస్తే ఐదు నిమిషాల్లో నేరగాళ్ళను పట్టేయవచ్చునన్నారు. సోమవారం పండిట్ నెహ్రూ బస్స్టేషన్ డిపార్చర్ బ్లాక్లో సీసీ కెమెరాల వ్యవస్థను సీపీ ప్రారంభించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆసియాలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పండిట్ నెహ్రూ బస్స్టేషన్ను భద్రతా పరంగా సమర్థవంతంగా తీర్చిదిద్దామన్నారు. నిఘా వ్యవస్థ ఏర్పాటునకు ఆర్టీసీ అధికారులు చూపిన చొరవ ప్రశంసనీయమన్నారు. నగరంలోని రద్దీ ప్రాంతాల్లో నేరాలు జరిగే అవకాశం ఉందన్నారు.
సెక్యూరిటీ పరంగా ఉన్న పరిమితుల కారణంగా పోలీసు శాఖ ఒక్కటే పూర్తి స్థాయిలో బాధ్యతలు నిర్వహించలేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతలను పంచుకోవాలన్నారు. రద్దీ ప్రాంతాలలో నిఘా కెమెరాల ఏర్పాటు ద్వారా సెక్యూరిటీ వ్యవస్థను బలోపేతం చేసుకోవచ్చన్నారు. నగరమంతటా టెక్నాలజీ పరంగా నిఘా వ్యవస్థను అమలు పరచాలన్నది తమ వ్యూహ మన్నారు.
బందరు రోడ్డులో ఎలాంటి ఘటనలు చోటు చేసుకున్నా.. పోలీసుల నుంచి తప్పించుకోవడం అసాధ్యమన్నారు. నిఘా వ్యవస్థను అలా పటిష్టం చేయడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. నగరం ప్రశాంతంగా ఉండాలంటే నిఘా కెమేరాల ఏర్పాటు అత్య వసరమన్నారు. బస్స్టాండ్లో గతంలో నిఘా కెమేరాలు ఉన్నా... ఇపుడు అత్యాధునికంగా 30 కెమేరాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు.
వీటి విజువల్స్ ఆర్టీసీతో పాటు నేరుగా పోలీస్ కమిషనరేట్కు కూడా అనుసంధానిస్తామన్నారు. దీనివల్ల టెర్రరిస్ట్ ఆపరేషన్లను కూడా సులువుగా ఛేదిస్తామన్నారు. ఆర్టీసీలాగా వ్యాపార సంస్థలు, బ్యాంకులు, ఇతర సంస్థలు ముందుకు వస్తే నగారాన్ని పూర్తిగా నిఘా నేత్రం పరిధిలోకి తీసుకురావచ్చన్నారు.
ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ఎ కోటేశ్వరరావు మాట్లాడుతూ, బస్స్టేషన్లో ప్రయాణికులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. నిత్యం రద్దీగా వుండే బస్స్టేషన్లో పోలీసు కమిషనర్ చొరవతో అత్యాధునిక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
తొలుత పోలీసు కమిషనర్కు నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయు), ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ), స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్డబ్ల్యుఎఫ్) నేతలు, కార్మికులు బొకేలు ఇచ్చి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిప్యూటి చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ ఎ సుధాకర్, సీఎంఈలు ధనుంజయ, రామారావు, ఏటీఎం దశరథ నాయక్, సీఐ సుబ్బారావు, కార్మిక సంఘాల నేతలు బర్మా ప్రభాకరరావు, వైవి రావు, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.
(And get your daily news straight to your inbox)
Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more
Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more
Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more
Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more
Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్కు ఏపీఎన్జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్జీవోల భవన్లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more