విజయవాడ, మేజర్న్యూస్ : నగర క్రీడాకారులు ప్రపంచ విలువిద్య పోటీలలో బంగారు పతకం సాధించాలని నగర మేయరు యం.వి. రత్నబిందు ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్రవారం గుణదల విజయలక్ష్మీ కాలనీలోని వి.యమ్.సి. జిల్లా ఆర్చరీ ఫీల్డ్ ఆవరణలో గతనెలలో మహారాష్ట్ర ఔరంగాబాద్లో జరిగిన జాతీయ విలువిద్య పోటీలలో పతకాలు సాధించిన వారికి అభినందన సభ ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ విలువిద్య క్రీడలో నగర బాలబాలికలు విశేషంగా రాణించడం అభినందనీయమన్నారు. క్రీడాకారులకు నగరపాలక సంస్థ అండదండలు ఎప్పుడూ ఉంఆయని ఆమె హామీ ఇచ్చారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గోకరాజు గంగరాజు మాట్లాడుతూ నగరంలో క్రీడాభివృద్ధికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ముందుంటుందన్నారు.
క్రీడాకారులు క్రమశిక్షణతో సాధన చేస్తే ప్రపంచ ఛాంపియన్లు అవడం పెద్ద విషయం కాదన్నారు. ఎ.సి.ఎ. నిధి నుండి రూ. 2.5 లక్షలు నగరంలో ఆర్చరీ అభివృద్ధికి కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి. సుధాకర్, కార్పోరేషన్ క్రీడాభివృద్ధి కార్యదర్శి అన్నే ప్రసన్న, కార్పోరేటర్ మాగంటి నరశింహ చౌదరి, చెరుకూరి సత్యనారాయణ, లెనిన్ తదితరులు పాల్గొన్నారు.
పతకాలు సాధించిన క్రీడాకారులు : రితుల్ ఛటర్జీ బ్యాంకాక్లో జరిగిన అంతర్ జాతీయ పోటీలలో జూనియర్ విభాగంలో ఒక బంగారు ఒక కాంశ్యం, నేషనల్ సబ్ జూనియర్ పోటీలలో వి. జ్యోతి సురేఖ వ్యక్తిగత కాంస్యం, టీం గోల్డ్ జి. కావ్య సబ్ జూనియర్ నేషనల్లో టీంగోల్డ్ వై. అనూషా రెడ్డి , సబ్ జూనియర్ నేషనల్లో టీం గోల్డ్ ఈ. సాహితి, సబ్ జూనియర్ నేషనల్ లో టీంగోల్డ్ సాధించారు. ఈ కార్యక్రమానికి హాజరైన నగర ప్రముఖులు క్రీడాకారులను అభినందించారు.
(And get your daily news straight to your inbox)
Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more
Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more
Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more
Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more
Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్కు ఏపీఎన్జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్జీవోల భవన్లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more