ప్రస్తుత క్రీడారంగంలో పురుషులకంటే మహిళలే మంచి ప్రదర్శనను కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. ఆమధ్య జరిగిన ఆసియా క్రీడల్లో కూడా చాలావరకు మహిళా క్రీడాకారిణులే తమ ప్రతిభతో పతకాలు గెలుచుకుంటూ భారత గౌరవాన్ని నిలబెట్టడంలో కీలకపాత్రను పోషించారనడంలో ఎటువంటి సంశయమూలేదు. ఆ క్రీడల్లోనే తెలుగమ్మాయిలు కూడా తమ సత్తా చాటారు. ఒక్కొక్క విభాగంలో ఒక్కొక్కరు జట్టు విజయంలో తమవంతు కృషి చేశారు. వారిని స్ఫూర్తిగా తీసుకునే జూనియర్లు కూడా క్రీడారంగంలో దూసుకుపోతున్నారని తెలుస్తోంది. తాజాగా మరో ముగ్గురు తెలంగాణ అమ్మాయిలు రెజ్లింగ్ పోటీలో అద్భుతంగా ప్రదర్శించి, పతకాలు నెగ్గారు.
జాతీయ స్కూల్ గేమ్స్లో భాగంగా నిర్వహించిన రెజ్లింగ్ పోటీల్లో తెలంగాణ అమ్మాయిలు మెరిశారు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో జరిగిన అండర్-19 బాలికల రెజ్లింగ్ చాంపియన్షిప్లో ఎస్. శ్యామల, పి.శిరీష, ఎం.మౌనిక తమ ప్రతిభతో అద్భుతంగా ప్రదర్శించి.. ప్రత్యర్థులను దాటుకుంటూ చివరికి కాంస్య పతకాలు గెలుపొందారు. ట్రినిటీ జూనియర్ కాలేజికి చెందిన శ్యామల 51 కేజీల విభాగంలో, శిరీష 55 కేజీల విభాగంలో కాంస్యాలు గెలిచారు. అలాగే రీజినల్ స్పోర్ట్స్ స్కూల్కు చెందిన మౌనిక 59 కేజీల విభాగంలో కాంస్యం నెగ్గింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే... ఈ ముగ్గురు కరీంనగర్ జిల్లాకు చెందినవారే కావడం విశేషం.
ఈ విధంగా పతకాలు గెల్చుకున్న ఈ ముగ్గురు అమ్మాయిలను తెలంగాణ పాఠశాల విద్యా జాయింట్ డెరైక్టర్ పి.వి.శ్రీహరి సోమవారం తన చాంబర్లో అభినందించారు. రాష్ట్ర స్కూల్ గేమ్స్ కార్యదర్శి కె.రామ్రెడ్డి, హైదరాబాద్ జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి ఎల్.రాజేందర్ ప్రసాద్లు కూడా వారి ప్రదర్శనను మెచ్చుకున్నారు. రాష్ట్ర రెజ్లింగ్ కోచ్ శ్రీనివాస్, జట్టు కోచ్ వాణిశ్రీ, మేనేజర్ బి.లక్ష్మణ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ముగ్గురు అమ్మాయిలు తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని నిలబెట్టారని వారు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ వారిని పొగడ్తలతో ముంచెత్తారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more