టీమిండియా క్రికెటర్ దినేష్ కార్తీక్, స్క్వాష్ స్టార్ దీపిక పల్లికల్ ఇద్దరికీ గతేడాదే నిశ్చితార్థం జరిగిన విషయం అందరికీ తెలిసిందే! కానీ ఇంతవరకు వీరిద్దరూ పెళ్లి మాత్రం చేసుకోలేదు. అయినప్పటికీ భార్యాభర్తల్లాగే వారిద్దరూ చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. తీరిక సమయం దొరికినప్పుడల్లా విదేశాలకు వెళ్లడం, పార్టీలు - ఫంక్షన్లకు అటెండ్ అవుతూ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు. అందరిచేత చూడముచ్చట జంటగా అప్పుడే పేరు సంపాదించుకున్నారు. అయితే తమ పెళ్లి ఎప్పుడు జరుగుతుందన్న విషయాన్ని మాత్రం వీరు ఇంతవరక బహిరంగంగా ప్రకటించిన సందర్భాలు అస్సలు లేవు. అయితే తాజాగా అందుతున్న సమాచారల ప్రకారం.. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలంటూ తెగ ఆరాటపడుతున్నారని తెలుస్తోంది. వచ్చే ఏడాదిలో వీరి పెళ్లి జరగవచ్చుననే వార్తలు వస్తున్నాయి.
ఇదే విషయమై క్రికెటర్ దినేష్ కార్తీక్ మాట్లాడుతూ.. ‘‘నేను కొద్దికాలంగా పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా వున్నాను. ఆమె కూడా ఆరంభం నుంచే వివాహానికి సిద్ధంగా వుంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఇద్దరూ పెళ్లి గురించి ఆలోచించలేకపోయాం. అయితే ఇప్పుడు మాకు ఒకరిపై ఒకరికి చక్కని అవగాహన ఏర్పడింది. పెళ్లికి మేమిద్దరం సిద్ధంగానే వున్నాం. అందుకు ఎటువంటి సందేహం లేదు’’ అంటూ పేర్కొన్నాడు. దీంతో వారిద్దరు 2015 ద్వితీయార్థంలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. ఏదేమైనా.. పెళ్లికి ముందే ఈ జంట అందరి దృష్టిని బాగానే ఆకర్షించిందని విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. త్వరలోనే వీరి పెళ్లి జరగాలని అందరూ ఆశిస్తున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more