ఆసియా క్రీడల్లో భారత్ బోణి కొట్టింది. గేమ్స్ ప్రారంభం అయిన తొలి రోజునే రెండు పతకాలు ఖాతాలో వేసుకుంది. అందులో ఒకటి స్వర్ణం అయితే.., మరొకటి కాంస్య పతకం. ఇవి రెండూ షూటింగ్ విభాగంలోనే రావటం విశేషం. మొదటగా స్వర్ణం పతకం సాధించినది జితురాయ్. పురుషుల యాబై మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో జితు స్వర్ణం సాధించాడు. తనతో పోటిపడ్డ ప్రత్యర్దులందర్ని చిత్తు చేస్తూ... గురితప్పకుండా గోలి కొట్టి పతకం పట్టుకొచ్చాడు. ఇక షూటింగ్ విభాగంలోనే భారత వనితకు కాంస్య పతకం వచ్చింది. పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో శ్వేత చౌదరి కాంస్య పతకం గెలిచింది. ఈ విభాగంలో స్వర్ణ పతకం చైనాకు వచ్చింది.
భారత కాలమానం ప్రకారం శుక్రవారం ప్రారంభం అయిన ఈ గేమ్స్ పదిరోజుల పాటు జరుగుతాయి. గతంతో పోలిస్తే భారత్ తరపున ఆటగాళ్లు., ముమ్మర కసరత్తు చేసి పోటిలకు వెళ్ళారు. ముఖ్యంగా చెప్పాలంటే షూటింగ్, వెయిట్ లిఫ్టింగ్ విబాగాల్లో ఎక్కువ పతకాలు వస్తాయని ఆశిస్తున్నారు. వీటితో పటు టెన్నిస్, బ్యాడ్మింటన్ ప్లేయర్లు కూడా పతకాలను తెచ్చిపెడతారని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అటు గ్లాస్సో గేమ్స్ మనకు మంచి ఫలితాలనే ఇస్తాయని కోచ్ లు కూడా విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
ఇక శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైన ఆసియా క్రీడలు పదిరోజుల పాటు జరుగుతాయి. వివిధ విభాగాల్లో మొత్తం 13వేల మంది ఆటగాళ్లు ఇక్కడ పోటీ పడుతున్నారు. వీరి కోసం 430 బంగారు పతకాలు సిద్దంగా ఉన్నాయి. 2010లో జరిగిన ఆసియా గేమ్స్ లో భారత్ 14 పతకాలు పొందగా., ఈ సారి మరిన్ని ఎక్కువగా సాధించాలని పట్టుదలతో ఉంది. ఇక ఆసియా గే్మ్స్ ప్రారంభం సంబరాలు అదిరిపోయాయి. కళ్లు చెదిరే వెలుగుల్లో.., మిరుమిట్లు గొలిపే కాంతులతో అంగరంగవైభవంగా ప్రారంభ వేడుక జరిగింది.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more