ఇంగ్లండ్ లో టెస్టు సిరీస్ లో భారత్ అధిపత్యాన్ని ప్రదర్శించింది. అందునా, క్రికెట్ మక్కాగా పేరుగాంచిన విశ్వవిఖ్యాత లార్డ్స్ మైదానంలో భారత్ అద్భుత విజయం సాధించింది. ఆతిథ్య జట్టుపై భారత్ బౌలర్లు నిప్పుగొలాల్లాంటి బంతులు విసిరి బెంబేలెత్తించారు. భారత బౌలర్ల ధాటికి ఇంగ్లాండ్ జట్టు విజయలక్ష్యానికి మరో 150 పరుగులు వుండగానే చేతులెత్తేసింది. దీంతో టీమిండియా 151 పరుగుల భారీ తేడాతో ఇంగ్లాండ్ ను చిత్తు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో అధిక్యాన్ని ప్రధర్శించిన ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ వచ్చే సరికి నిర్ధేశిత లక్ష్యచేధనలో చతికిలపడింది.
272 పరుగుల విజయలక్ష్యంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 120 పరుగులకే కుప్పకూలింది. భారత సీమర్లు జస్పీత్ బూమ్రా, సిరాజుద్దీన్, షమీలు ఇంగ్లాండ్ ఆటగాళ్లను కుప్పకూల్చడంతో పాటు టీమిండియా విజయంలోనూ కీలక పాత్ర పోషించారు. సిరాజ్ 4 వికెట్లతో ఇంగ్లండ్ భరతం పట్టాడు. బుమ్రాకు 3, ఇషాంత్ కు 2, షమీకి ఓ వికెట్ లభించాయి. ఓ దశలో ఇంగ్లండ్ జట్టు 7 వికెట్లు కోల్పోగా, మరో పది ఓవర్లు కాచుకుంటే మ్యాచ్ డ్రాగా ముగుస్తుందన్న నేపథ్యంలో బుమ్రా... రాబిన్సన్ (9) ను అవుట్ చేశాడు.
ఆ తర్వాత మహ్మద్ సిరాజ్ ఒకే ఓవర్లో బట్లర్ (25), ఆండర్సన్ (0) లను అవుట్ చేసి భారత్ విజయాన్ని ఖాయం చేశాడు. ఈ మ్యాచ్ లో భారత్ తొలిఇన్నింగ్స్ లో 364 పరుగులు చేయగా, ఇంగ్లండ్ 391 పరుగులు నమోదు చేసింది. ఇంగ్లండ్ కు 27 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించినా, అదేమంత ప్రయోజనం కలిగించలేదు. ఇక భారత్ తన రెండో ఇన్నింగ్స్ లో 8 వికెట్లకు 298 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. టీమిండియా ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్ లో 1-0 తో
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more