మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనికి మ్యాచ్ ఫినిషర్ గా మంచి పేరుంది. అలాంటి వ్యక్తి రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో ఎందుకు గెలిపించలేకపోయాడన్న ప్రశ్నలు తలెత్తుడంతో ఆయనకు మద్దతుగా నిలిచాడు చెన్నై సూపర్కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ అంగా నిలిచాడు. అతడిలోని అత్యుత్తమ మ్యాచ్ ఫినిషర్ బయటకు వచ్చేందుకు మరికొంత సమయం పడుతుందని అన్నారు. అయినా ఐపీఎల్ ఆరంభమయ్యింది ఇప్పుడే కదా.. కొంత రసపట్టుకు వచ్చేసమయానికి ముందే ధోని ఫినిషర్ గా మారడం ఖాయమని ప్లెమింగ్ చెప్పాడు. ప్రతీ ఏటా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూనే ఉంటాయని పేర్కొన్నాడు.
రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ధోనీ 14వ ఓవర్లో బ్యాటింగ్ దిగాడు. అయితే నిలదొక్కుకొని ఆడేందుకు కొద్దిగా సమయం తీసుకున్నాడు. మరోవైపునున్న డుప్లెసిస్ రాయల్స్ బౌలర్లను బెంబేలెత్తిస్తున్న సమయంలో ధోణి మాత్రం మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా ఆడేందుకు ప్రయత్నించాడు. చాలాకాలంగా అతడు క్రికెట్ ఆడలేదు. అందుకే మహీలోని అత్యుత్తమ ఫినిషర్ బయటకొచ్చేందుకు కాస్త సమయం పడుతుంది. మ్యాచ్ చివర్లో మాత్రం అతడు అద్భుతంగా ఆడాడు. డుప్లెసిస్ ఫామ్ కొనసాగించాడు. లక్ష్యానికి దాదాపుగా చేరుకున్నాం కాబట్టి బ్యాటింగ్ తీరుపై ఆందోళన లేదు’ అని ఫ్లెమింగ్ అన్నాడు.
అయితే ఇకపై ఆడనున్న మ్యాచులలో డుప్లెసిస్ ఓపెనర్ గా బరిలోకి దిగుతాడని స్టీఫెన్ ప్లెమ్మింగ్ తెలిపారు. కాగా, మొదటి మ్యాచ్ తరహాలో షాట్లు బాది రన్ రేట్ ను తగ్గిస్తాడనే కరణ్ ను ముందు పంపించామని ఫ్లెమింగ్ చెప్పాడు. రుత్ రాజ్ కు ఇదే తొలిమ్యాచని, దూకుడు కొనసాగించాలని పంపామన్నాడు. తమ బౌలర్లు లెంగ్త్ ల విషయంలో పొరపాటు పడ్డారని పేర్కొన్నాడు. కాస్త ఫుల్ లెంగ్త్ బంతులు వేయడంతో రాజస్థాన్ ఆటగాళ్లు భారీ షాట్లు ఆడారని తెలిపాడు. రానున్న మ్యాచులలో తమ జట్టు బాగా రాణిస్తుందని ప్లెమ్మింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more