టీమిండియా వికెట్ కీపింగ్ దిగ్గజం మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ కెరీర్ చరమాంకంలో ఉన్నదన్న చర్చ దేశవ్యాప్తంగా సాగుతోంది. ఈ చర్చ మాజీ కెప్టెన్ అభిమానులను ఒకింత అందోళనకు గురిచేస్తోంది కూడా. అయితే క్రికెట్ పండితులు మాత్రం వరల్డ్ కప్ ముగిసిన అనంతరం ధోనీ రిటైర్మెంటు ప్రకటిస్తారని అప్పట్లో సంకేతాలు ఇచ్చారు. కానీ ఇప్పుడు ప్రపంచకప్ ముగిసిన తరువాత కూడా ఆ ఊసే ఎత్తడం లేదంటూ చర్చలకు తావిస్తున్నారు.
ఇక దీనికి తోడు పారాచూట్ రెజిమెంట్ లో పనిచేసేందుకు రెండు నెలల ఆటకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. దాంతో, వెస్టిండీస్ టూర్ కు ధోనీని టీమిండియా సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదు. అయితే, వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ధోనీతో చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడినట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది టి20 వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో, సమర్థుడైన వికెట్ కీపర్ ను ఇప్పటినుంచే తయారు చేసుకునేందుకు వీలుగా ధోనీతో ఎమ్మెస్కే చర్చలు జరపారు.
కాగా, తానిప్పుడు రిటైర్ కావడంలేదని, అదే సమయంలో టీమిండియా భవిష్యత్ ప్రణాళికల్లో కూడా భాగం కాదలచుకోలేదని ధోనీ స్పష్టం చేసినట్టు సమాచారం. ఇక తనను మేజర్ టోర్నమెంట్లకు పరిగణనలోకి తీసుకోనవసరంలేదని ధోనీనే పరోక్షంగా చెప్పడంతో కుర్రాళ్లను ఎంకరేజ్ చేయాలని భారత సెలెక్టర్లు నిర్ణయించుకున్నారు. ఈ కారణంగానే రిషబ్ పంత్ ను మూడు ఫార్మాట్లలో ప్రధాన వికెట్ కీపర్ గా విండీస్ పర్యటనకు ఎంపిక చేసినట్టు అర్థమవుతోంది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more