టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పై దాఖలైన పరస్పర విరుద్ధ ప్రయోజనాల పిర్యాదును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఎథిక్స్ ఆఫీసర్ జస్టిస్ డీకే జైన్ కొట్టేశారు. బిసిసిఐలో క్రికెట్ సలహా కమిటీలో సభ్యుడిగా కొనసాగుతున్న సమయంలోనే.. అటు ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కు ఐకాన్ గా వ్యవహరిస్తున్నాడంటూ ఆయనపై ఓ మాజీ క్రికెటర్ పిర్యాదు చేశాడు. సచిన్ టెండుల్కర్ తో పాటు సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ లపై కూడా ఈ పిర్యాదులు అందాయి.
ఈ క్రమంలో ఇది పరస్పర విరుద్ధ ప్రయోజనాలు కిందకే వస్తుందంటూ బీసీసీఐ ఎథిక్స్ అధికారి జస్టిస్ జైన్.. సచిన్కు నోటీసులు పంపారు. నిర్ధిష్ట సమయంలోపు తమ సమాధానాలు చెప్పాలని కూడా నోటీసులలో అదేశించారు. ఒక్కసారి అవకాశాన్ని కోల్పేతే మరో పర్యాయం ఈ విషయమై ఎలాంటి వివరణలను వినబోమని కూడా జస్టిస్ జైన్ పేర్కోన్నారు. దీనిపై పూర్తిగా విచారించిన బీసీసీఐ ఎథిక్స్ అధికారి జస్టిస్ డీకే జైన్... సచిన్ పదవి విరుద్ధ ప్రయోజన అంశం కిందకు రాదంటూ తేల్చి చెప్పేశారు.
ఈ మేరకు తీర్పు వెలువడడంతో సచిన్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో తనకు వచ్చిన నోటీసులపై సచిన్ ఘాటుగా స్పందించాడు. 'సీఏసీలో సభ్యుడిగా ఉంటూ.. ముంబై ఇండియన్స్ ఐకాన్గా కొనసాగితే వచ్చే సమస్య ఏంటని ప్రశ్నించాడు. 2013లోనే ముంబై ఇండియన్స్ ఐకాన్ గా ఎంపికైన విషయం తెలిసే 2015లో బీసీసీఐ సీఏసీలో సభ్యుడిగా ఎంపిక చేసుకుందని వెల్లడించాడు. ఇంకా కావాలంటే బీసీసీఐ నుంచే వివరణ కోరండి' అంటూ వివరించాడు. మొత్తం 13 పాయింట్లతో సచిన్ వివరణ ఇచ్చాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more